తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 9:18 PM IST

Updated : Apr 13, 2021, 10:45 PM IST

ETV Bharat / bharat

'కరోనాను జయించడానికి​ ప్రపంచం ఐక్యం కావాలి'

ఏడాది కాలంగా కరోనా ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు ప్రధాని మోదీ. మహమ్మారిని జయించడానికి ప్రపంచం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు.

PM Modi calls for united global efforts to defeat COVID pandemic
'మహమ్మారిని జయించడానికి​ ప్రపంచం ఐక్యం కావాలి'

కొవిడ్ 19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 130 కోట్ల భారతీయులను కాపాడుకుంటూనే.. వైరస్​పై పోరాటంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తున్నట్లు మంగళవారం వర్చువల్​గా జరిగిన 'రైజీనా సదస్సు'లో చెప్పారు.

పాస్​పోర్టు రంగుతో సంబంధం లేకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వైరస్​ నుంచి బయటపడితే తప్ప మహమ్మారిని జయించలేం. అందుకే ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ 80కి పైగా దేశాలకు టీకాలను సరఫరా చేశాం.

- నరేంద్ర మోదీ, ప్రధాని

నేటి సమస్యలను, రేపటి సవాళ్లను ఎదుర్కోగలిగే వ్యవస్థలను మనం సృష్టించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో భారత్​ అనుభవాలు, జ్ఞానం, వనరులను ఎప్పటిలాగే ఇతర దేశాలతో పంచుకుంటామని హామీఇచ్చారు.

ఇదీ చూడండి:'టీకా కొరత లేదు.. ప్రణాళిక లేకపోవడమే సమస్య'

Last Updated : Apr 13, 2021, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details