తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగాల్​లో శాంతిభద్రతలపై మోదీ ఆందోళన' - బంగాల్​లో హింస

బంగాల్​లో ఎన్నికల ఫలితాల చెలరేగిన హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్రమోదీ.. తనకు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ తెలిపారు. రాజకీయ హింస, హత్యలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు గవర్నర్.

Governor of bengal
బంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్

By

Published : May 4, 2021, 4:03 PM IST

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ వెల్లడించారు. ఈ మేరకు తనతో ఫోన్​లో మాట్లాడారన్నారు. రాజకీయ హింస, హత్యలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు గవర్నర్. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా అభివర్ణించారు. రాష్ట్రంలోని చట్టవిరుద్ధ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగాలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

" బంగాల్​లో హింస, విధ్వంసం, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. వివేకంలేని రాజకీయ హింస ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఎన్నికల తర్వాత బంగాల్​లోనే హింస ఎందుకు? ప్రజాస్వామ్యంపై దాడి ఎందుకు?"

-- జగదీప్ ధనకర్, బంగాల్ గవర్నర్

ఇదీ చదవండి :బంగాల్​లో రాజకీయ హింస.. ముగ్గురు మృతి

నాజీ పాలన..

బంగాల్​లో చెలరేగిన రాజకీయ హింసాత్మక ఘటనలను కలకత్తా హైకోర్టు సుమోటా తీసుకుని విచారణ చేపట్టాలని భాజపా నేత స్వపన్ దాస్ గుప్తా కోరారు. బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ చర్యలు.. నాజీ పాలనకు అద్దం పడుతున్నాయన్నారు. బంగాల్​లో ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

'అగ్నిగుండంలా బంగాల్'

" రాష్ట్ర ప్రభుత్వం పోత్సహిస్తున్న రాజకీయ హింస కారణంగా బంగాల్ అగ్నిగుండంలా మారింది. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. మమతా జీ.. మీరు బంగాల్ కూతురని చెప్పుకున్నారు. మరి హింసలో మరణించిన, అత్యాచారానికి గురైన మహిళలు.. బంగాల్ కుమార్తెలు కారా? భాజపా కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుంది."

-- సంబిత్ పాత్రా, భాజపా జాతీయ అధికార ప్రతినిధి

హింసపై సుప్రీంకోర్టుకు

బంగాల్​లో హింసపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు భాజపా నేత గౌరవ్ భాటియా.

బంగాల్​లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆది, సోమవారాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు భాజపా కార్యకర్తలు మరణించినట్లు భాజపా ఆరోపించింది.

ఇదీ చదవండి :'బంగాల్​ హింసలో ఆరుగురు మృతి'

ABOUT THE AUTHOR

...view details