తెలంగాణ

telangana

By

Published : Nov 25, 2020, 7:59 PM IST

ETV Bharat / bharat

ఈవీఎంలు వాడొద్దంటూ సుప్రీంలో పిటిషన్​

రానున్న ఎన్నికల్లో ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల(ఈవీఎం) స్థానంలో బ్యాలెట్ పేపర్లను వాడేవిధంగా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈవీఎం ఓటింగ్ విధానంలో కచ్చితత్వం లేదని పిటిషన్​దారు పేర్కొన్నారు.

Plea in SC seeks direction to EC to stop using EVMs, use ballot paper in polls
'ఈవీఎంలు వద్దు.. బ్యాలట్​ పేపర్లను వినియోగించండి'

దేశంలో వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ సుప్రీంకోర్టులో అడ్వకేట్ సీఆర్.​ జయ సుకిన్ బుధవారం పిటిషన్​ దాఖలు చేశారు. ఈవీఎంలలో ఓటింగ్ తప్పుగా నమోదవుతుందని, కచ్చితత్వం లోపిస్తోందని పిటిషన్​లో పేర్కొన్నారు.

"దేశవ్యాప్తంగా ఈవీఎం ఓటింగ్​ విధానాన్ని మార్చాలి. ఈవీఎంలు ట్వాంపరింగ్​కు గురి అవుతున్నాయి. సంప్రదాయ బ్యాలెట్ పేపర్లను వినియోగించాలి. ఏ దేశంలోనైనా బ్యాలెట్ ఓటింగ్​ విధానంలో విశ్వసనీయత, పారదర్శకత ఉంటుంది."

-- పిటిషన్​లో అడ్వకేట్ సీఆర్. జయ సుకిన్​

ఈవీఎంలలో లోపం ఉందంటూ గతంలో వచ్చిన వార్తలను ఎన్నికల సంఘం పలుమార్లు ఖండించింది. ఈవీఎంలు సురక్షితం, ట్యాంపరింగ్​ చేయటం అసాధ్యం అని తెలిపింది.

ఇదీ చదవండి :'ఫార్ములా 23'తో భాజపా 'బంగాల్​ మిషన్​-200'

ABOUT THE AUTHOR

...view details