తెలంగాణ

telangana

By

Published : May 27, 2021, 12:18 PM IST

Updated : May 27, 2021, 12:38 PM IST

ETV Bharat / bharat

Vaccination: టీకాలు ఆపాలని పిటిషన్​- రూ. 50 వేలు ఫైన్​!

పూర్తిస్థాయిలో క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించకుండానే కొవిడ్ టీకాలను(covid vaccine) వినియోగిస్తున్నందున.. టీకా పంపిణీ ప్రక్రియను(vaccination) నిలిపివేయాలని దాఖలైన పిల్​ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగానూ పిటిషన్​దారుకు రూ.50,000 జరిమానా విధించింది.

karantak high court
కర్ణాటక హైకోర్టు

కొవిడ్​ టీకా(covid vaccine) పంపిణీ ప్రక్రియను(vaccination) నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్​) కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్​దారుకు రూ.50,000 జరిమానా విధించింది. కరోనా కట్టడికి వినియోగిస్తున్న టీకాలపై(covid vaccine) పూర్తిస్థాయి క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించకుండానే వినియోగించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఓ ఆర్మీ మాజీ అధికారి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఏఎస్​ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యం ప్రజా ప్రయోజనాలకు సంబంధించినది కాదని పేర్కొంది.

దేశంలో జనవరిలోనే టీకా పంపిణీ ప్రక్రియ(vaccination) ప్రారంభమైనందున.. ఇప్పుడు వ్యాక్సిన్​ రద్దు చేయాలని కోరడం అసందర్భమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం లక్షలాది మంది.. టీకా తీసుకునేందుకు ఎదురు చూస్తున్నారని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను పిటిషన్​ దారుకు రూ.50,000 జరిమానా విధించింది.

అంతకుముందు.. 'కేంద్ర ప్రభుత్వం రెండు వ్యాక్సిన్లకు అనుమతించింది కానీ, వాటికి సంబంధించిన రికార్డులేవీ లేవు' అని పిటిషన్​దారు తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. 2019 ఔషధ నిబంధనలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించిందని తెలిపారు. టీకా పంపిణీని నిలిపివేయాలని, లేదంటే.. సమాజానికి పెద్దహాని తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు.

Last Updated : May 27, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details