తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2022, 4:48 AM IST

ETV Bharat / bharat

'భాజపా ఆఫీస్​పై పెట్రోల్ బాంబు దాడి కేసులో భారీ కుట్ర'

Petrol Bomb at BJP Office: తమిళనాడులో భాజపా ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) విచారణ జరపాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ కేసులో భారీ కుట్ర దాగి ఉందని రాష్ట్ర భాజపా చీఫ్​ అన్నామలై అనుమానం వ్యక్తం చేశారు.

Petrol Bomb at BJP Office
బాంబు దాడి

Petrol Bomb at BJP Office: తమిళనాడులో భాజపా ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) విచారణ జరపాలని డిమాండ్ చేసింది భారతీయ జనతా పార్టీ. నేరస్థున్ని తప్పకుండా శిక్షించాలని రాష్ట్ర భాజపా చీఫ్​ అన్నామలై డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపించారు.

ఈ కేసులో భారీ కుట్ర దాగి ఉందని అన్నామలై అన్నారు. ఎన్​ఐఏ దర్యాప్తుతో మాత్రమే సరైన న్యాయం దక్కుతుందని చెప్పారు. ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వ పాత్రను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:భారత జలాల్లోకి పాక్​ బోట్లు.. సీజ్​ చేసిన బీఎస్​ఎఫ్​

ABOUT THE AUTHOR

...view details