తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జనతా కర్ఫ్యూ'ను కూడా లెక్క చేయని ప్రజలు - కర్ణాటక జనతా కర్ఫ్యూ

దేశంలో కరోనా విజృంభిస్తున్నా ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. నిబంధనలపై నిర్లక్ష్యం వహిస్తూ బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించకుండానే తిరుగుతున్నారు. కర్ణాటకలోని హుబ్బళ్లీలో ఇటువంటి ఘటనే జరిగింది. అక్కడ జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా.. జనం భారీగా మార్కెట్​కు మార్కెట్​కు తరలివచ్చారు.

karnataka janata curfew, hubli news karnataka
కర్ణాటకలో నిబంధనల ఉల్లంఘన

By

Published : May 8, 2021, 12:02 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారాంతాల్లో జనతా కర్ఫ్యూను కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తోంది. కానీ ఆంక్షలను ప్రజలు విస్మరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడుతున్నారు. హుబ్బళ్లీలోని ఏపీఎంసీ (అగ్రికల్చర్​ ప్రోడ్యూస్​ మర్కెట్​ కమిటీ) మార్కెట్​లో నిబంధనలను ఉల్లంఘిస్తూ కూరగాయలు కొనేందుకు ప్రజలు శనివారం ఇలా భారీగా తరలివచ్చారు.

నిబంధనలను ఉల్లంఘించిన ప్రజలు
కర్ణాటక హుబ్బళ్లీలో నిబంధనలను ఉల్లంఘించిన ప్రజలు

రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈనెల 10 నుంచి 24 వరకు రెండు వారాల పాటు లాక్​డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ​

ఇదీ చదవండి :లాక్​డౌన్​ ఉన్నా.. ముంబయికి పోటెత్తున్న వలస కార్మికులు

ABOUT THE AUTHOR

...view details