గుజరాత్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. లాక్డౌన్ విధించొచ్చన్న అనుమానాలు అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పొగాకు వ్యసనపరులు.. ముందుజాగ్రత్త పడుతున్నారు. జూనాగఢ్లోని పొగాకు దుకాణాల ముందు బారులు తీరి పొగాకు కొనుగోలు చేస్తున్నారు.
జూనాగఢ్లో లాక్డౌన్ భయంతో పొగాకు దుకాణం ముందు బారులు తీరిన జనం జూనాగఢ్లో పొగాకు కొనుగోలు చేస్తున్న జనం గతేడాదిలా ఇబ్బంది పడొద్దని..
"గతేడాది దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో పొగాకు కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. వేల రూపాయలను ఖర్చు చేసి పొగాకును కొనుగోలు చేశాం. అలాంటి ఇబ్బందులు ఇప్పుడు మళ్లీ పడుకూడదనే.. నెలకు సరిపడా కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాం."
-కొనుగోలుదారు.
అయితే.. గుజరాత్లో పొగాకు అమ్మకాలపై 2012లో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నిషేధం విధించారు. కానీ, ఇప్పుడు మాత్రం వందలాది దుకాణాల్లో వీటి అమ్మకం కొనసాగుతోంది. దిల్లీలో గతవారం లాక్డౌన్ విధించినప్పుడు కుడా.. చాలా మంది ఇలాగే మద్యం షాపుల ముందు బారులు తీరిన సంఘటనలు కనిపించాయి.
పొగాకు దుకాణాల ముందు క్యూ గుజరాత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 9 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పింది. ఈ కర్ఫ్యూ కాకుండా 29 నగరాల్లో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిత్యావసరాల సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది.
ఇదీ చూడండి:తండ్రి శవంతో రెండు రోజులుగా ఇంట్లోనే చిన్నారి
ఇదీ చూడండి:కరోనాను జయించిన మాజీ ప్రధాని మన్మోహన్