తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త

పింఛనుదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. లైఫ్​ సర్టిఫికెట్​ను సమర్పించేందుకు ఇచ్చిన గడువును 2021 ఫిబ్రవరి 28కి పొడగించింది.

By

Published : Dec 20, 2020, 8:53 PM IST

Pensioners can submit life certificates till Feb 28: Union Minister Jitendra Singh
పింఛన్‌దారులకు కేంద్రం శుభవార్త

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది.పింఛనుదారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పణ తేదీని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు. దీంతో కరోనా వైరస్‌ వల్ల దరఖాస్తు చేయలేకపోయిన పింఛనుదారులకు ఊరట లభించనుంది.

బయోమెట్రిక్​ పరికరాలు ఉంటే ఇంటి నుంచే లైఫ్​ సర్టిఫికెట్​ను సమర్పించవచ్చని మంత్రి తెలిపారు. ఇండియన్​ పోస్టల్​ పేమెంట్స్​ బ్యాంక్​ సహకారంతోనూ జీవన ప్రమాణ పత్రం పొందవచ్చని సూచించారు.

"పెన్షనర్లు బ్యాంకుల వద్ద గుమికూడతారు. ఈ కారణంగా కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. 80ఏళ్లు పైబడిన వారు జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించేందుకు ప్రత్యేక విండోను కూడా ఏర్పాటు చేశాం."

-జితేంద్ర సింగ్​, కేంద్రమంత్రి

ఇదీ చూడండి: ప్రపంచంలోనే అతిపెద్ద జూ నిర్మిస్తున్న రిలయన్స్!

ABOUT THE AUTHOR

...view details