తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2023, 4:03 PM IST

ETV Bharat / bharat

రూ.14 లక్షలకు అమ్ముడుపోయిన ఎద్దు.. కన్నీటితో సాగనంపిన గ్రామస్థులు

కర్ణాటకలో ఓ ఎద్దును ఏకంగా రూ.14 లక్షలకు అమ్మి వామ్మో అనేలా చేశారు ఇద్దరు రైతు సోదరులు. సంవత్సరం క్రితం రూ.5 లక్షలకు కొనుగోలు చేసిన ఈ ఎద్దు ద్వారా బాగానే ఆదాయాన్ని సంపాదించారు. ప్రస్తుతం దీనిని ఇంత భారీ మొత్తానికి అమ్మడం వల్ల అందరూ ఈ ఎద్దు గురించే చర్చించుకుంటున్నారు.

Bull Sold For Rs.14 Lakhs In Bagalkot Karnataka
రూ.14 లక్షలకు అమ్ముడుపోయిన ఎద్దు

కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన ఇద్దరు రైతు సోదరులు తాము పెంచుకున్న ఎద్దును ఏకంగా రూ.14 లక్షలకు అమ్మేశారు. ఏడాది క్రితం రూ.5 లక్షలకు కొన్న ఈ ఎద్దును ఇంత పెద్ద మొత్తంలో విక్రయించటం వల్ల ప్రస్తుతం చుట్టుపక్కల వారందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. బాగల్‌కోట్‌ జిల్లాలోని మెటగుడ్డ హలకి గ్రామానికి చెందిన కాశిలింగప్ప గడదర, యమనప్ప గడదర అనే ఇద్దరు అన్నదమ్ములు సంవత్సరం కిందట రూ.5 లక్షల రూపాయలకు ఈ ఎద్దును రాద్యరట్టి గ్రామంలో కొన్నారు. ప్రస్తుతం దీనిని నందగావ్ గ్రామానికి చెందిన విఠ్ఠల అనే పాడి రైతుకు విక్రయించారు.

వృషభం తెచ్చిపెట్టిన ఖజానా..!
ఈ ఎద్దు ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన అనేక ఎడ్ల బండ్ల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి పలు బహుమతులనూ గెలుచుకుంది. 6 బైక్​లు, 5 తులాల బంగారంతో పాటు సుమారు రూ.12 లక్షలు నగదు ఈ వృషభం కారణంగానే రైతు సోదరులకు దక్కాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు దీనిపై ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. రూ.14 లక్షలకు ఎద్దును కొనుగోలు చేసిన రైతు దగ్గరకు పంపించే ముందు గ్రామస్థులు దీనికి హారతులు ఇచ్చి మరీ భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.

రూ.14 లక్షలకు అమ్ముడుపోయిన వృషభం

గతేడాది ఈ సమయంలోనే ఇదే జిల్లాకు చెందిన ఓ రైతు తాను పెంచుకున్న రాజా అనే ఎద్దును రూ.13.5 లక్షలకు విక్రయించి వార్తల్లో నిలిచాడు. ఆ ఎద్దు కూడా చాలాసార్లు పోటీల్లో పాల్గొని అవార్డులను గెలుచుకుంది.

ABOUT THE AUTHOR

...view details