తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 41 లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్

భారత్​లో కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 41 లక్షలు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

By

Published : Feb 3, 2021, 5:33 AM IST

Updated : Feb 3, 2021, 6:15 AM IST

దేశంలో వ్యాక్సినేషన్​ ఊపందుకుంటోంది. ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 41 లక్షల 20 వేలు దాటినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. తొలి విడతలో భాగంగా భారత్​లో కరోనాపై పోరులో ముందుండి పోరాడిన ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్​ ఇస్తున్నారు.

బంగాల్​, గుజరాత్​లో మంగళవారం నుంచే వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది. ఒక్కరోజే రెండు రాష్ట్రాల్లోని దాదాపు 20 వేల ఫ్రంట్​లైన్​ వర్కర్లకు టీకా ఇచ్చారు. మొత్తంగా మంగళవారం.. దేశవ్యాప్తంగా లక్షా 70 వేల మందికిపైగా లబ్ధిదారులు టీకా పొందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కూడా మూడో రోజు కొనసాగింది. ఇప్పటివరకు 11 కోట్ల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.

ఇదీ చూడండి:ఏటీఎం దాడి కేసులో ఏడేళ్లకు తీర్పు- 12 ఏళ్ల శిక్ష

Last Updated : Feb 3, 2021, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details