తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2021, 7:49 PM IST

ETV Bharat / bharat

దేశంలో 24వేలకు పైగా చిన్నారులు ఆత్మహత్య!

చిన్నారుల ఆత్మహత్యలకు సంబంధించి విస్తుపోయే గణాంకాలను వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. 2017-19 మధ్య కాలంలో 24వేలకు పైగా మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు తెలిపింది.

suicides
ఆతహత్య

2017-19 మధ్యకాలంలో 14 నుంచి 18 వయసున్న 24 వేలకుపైగా మంది చిన్నారులు(టీనేజర్లు) ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్​సీఆర్​బీ) వెల్లడించింది. వారిలో పరీక్షల్లో విఫలమయ్యారనే కారణంతో సూసైడ్​ చేసుకున్నవారు 4వేలకు పైగా ఉన్నారని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో నివేదిక సమర్పించింది ఎన్​సీఆర్​బీ.

ఎన్​సీఆర్​బీ డేటా ప్రకారం..

2017-19 మధ్యకాలంలో మొత్తం మీద 24,568మంది చిన్నారులు ఆతహత్య చేసుకొని చనిపోయారు. అందులో 13,325 మంది బాలికలున్నారు.

ఇలాంటి ఘటనలు ఏటికేడు పెరుగుతున్నాయి. 2017లో 8,029, 2018లో 8,162, 2019లో 8,377 మంది చిన్నారులు సూసైడ్ చేసుకొని ప్రాణాలు వదిలారు.

అత్యధిక సూసైడ్ మరణాల్లో మధ్యప్రదేశ్, బంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు.. తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

కారణాలు..

పరీక్షల్లో విఫలం కావడం-4,046 మంది

ప్రేమ వ్యవహారం-3,315 మంది

అనారోగ్యం-2,567 మంది

వివాహ సంబంధ పరమైనవి- 639 మంది

ఇదీ చూడండి:పెళ్లంటే భయం- కవలలు ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details