తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లితండ్రులు మృతి- చిన్నారికి అన్నీ తానైన అక్క - Orphaned Due To COVID, 7-Year-Old Girl Taking Care Of Newborn Brother

కరోనాతో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతే.. నెలలు కూడా నిండని తన చిట్టి తమ్ముడికి అమ్మై లాలిస్తుంది ఆ ఏడేళ్ల చిన్నారి. అమ్మానాన్నలు లేరనే బాధ ఓ పక్క.. తమ్ముడి లాలన మరో పక్క. ఎగిసి పడుతున్న కన్నీటిని దిగమింగుతూ.. సోదరుడిని అన్నీ తానై అడిస్తోంది.

Orphaned Due To COVID
అనాథలైన అక్కాతమ్ముడు

By

Published : Jun 15, 2021, 11:10 PM IST

కరోనాతో అనాథలైన పిల్లలు

అభంశుభం తెలియని ఆ చిన్నారులను విధి వంచించింది. లాలించి పెంచాల్సిన అమ్మానాన్నాలు కరోనాతో తిరిగి రాని లోకాలకు వెళ్లారు. దీంతో ఉన్న చిట్టి తమ్ముడు బాధ్యతను భుజాలపైకెత్తుకుంది ఏడేళ్ల చిన్నారి. తమ్ముడి బాధ్యతను ఓ కన్న తల్లిలా ఆకలింపు చేసుకుని ఆలనా పాలనా చూస్తూ అమ్మలేని లోటును తీరుస్తోంది. ఈ దృశ్యాలు ఒడిశా బాలేశ్వర్ జిల్లా నిమత్​పుర్​లో కనిపిస్తున్నాయి.

ఏం జరిగిందంటే..

కమలేశ్ పాండా, స్మిత దంపతులు. బాలేశ్వర్ జిల్లా భోగరాయ్​ మండలం నిమత్​పుర్​లో నివాసముంటున్నారు. కమలేశ్​(36) భువనేశ్వర్​లోని ఈస్ట్​కోస్ట్​ రైల్వే డిపార్ట్​మెంట్​లో పనిచేస్తుండగా.. అతని భార్య స్మిత(28) కటక్​లోని ఆచార్య హరిహర కేన్సర్​ ఆస్పత్రిలో స్టాఫ్​ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గర్భిణీ అయిన స్మితకు ఏప్రిల్​ 15న కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో కటక్​లోని ఎస్​సీబీ కొవిడ్​ వార్డులో చేరారు. శిశువుకు జన్మనిచ్చిన వారం రోజులకే వైరస్​తో స్మిత మృతిచెందారు. ఆ తర్వాత కమలేశ్​ కూడా కొవిడ్ బారిన పడ్డారు. ఆయన భువనేశ్వర్​లోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

అన్నీతానైన ఏడేళ్ల సోదరి..

కేవలం రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రలను కోల్పోయారు ఆ చిన్నారులు. ఈ బాధను దిగమింగుకొని చంటి బిడ్డగా ఉన్న తమ్ముడిని ఎంతో బాధ్యతగా చూసుకుంటోంది ఆ చిన్నారి. సమయానికి తమ్ముడిని నిద్రపుచ్చడం దగ్గర నుంచి... గుక్కపెట్టి ఏడిస్తే లాలించి ఓదార్చే వరకు అన్నీ తానై చూసుకుంటుంది. ప్రస్తుతం వీరిద్దరూ కమలేశ్ సోదరుడి ఇంటి వద్ద ఉంటున్నారు.

ఇదీ చదవండి :రూ.16కోట్ల ఇంజెక్షన్​ అందక చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details