సంస్థాగత ఎన్నికలు, రాబోయే శాసనసభ ఎన్నికలు, లఖింపూర్ ఖేరి ఘటన తదితర అంశాలే ప్రధాన ఏజెండాగా నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (congress working committee meeting) జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నేతలంతా పాల్గొనే ఈ సమావేశంలో.. అనేక సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఆ రాష్ట్రాల పరిస్థితిపై నేడు సీడబ్ల్యూసీ భేటీ - కాంగ్రెస్ పార్టీ వార్తలు తాజా
రానున్న ఎన్నికలు, లఖింపూర్ ఘటన తదితర అంశాలే ప్రధానంగా నేడు సీడబ్ల్యూసీ (congress working committee meeting) సమావేశం జరగనుంది. కొత్త కాంగ్రెస్ చీఫ్ను ఎన్నుకునే షెడ్యూల్పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
![ఆ రాష్ట్రాల పరిస్థితిపై నేడు సీడబ్ల్యూసీ భేటీ congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13368013-thumbnail-3x2-congress.jpg)
పూర్తి స్థాయి అధ్యక్షుడు లేనప్పుడు పార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏం జరుగుతుందో తెలియటం లేదంటూ కపిల్ సిబల్ జీ-23 నాయకుల ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో...ఈ సమావేశం (congress working committee meeting) ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త కాంగ్రెస్ చీఫ్ను ఎన్నుకునే షెడ్యూల్పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 22 న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో 2021 జూన్ నాటికి నూతన అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుందని అధిష్ఠానం నిర్ణయించింది. అయితే కొవిడ్ వల్ల మే 10న జరగాల్సిన సీడబ్ల్యూసీ సమావేశం వాయిదా పడింది. అక్టోబర్ 3 న జరిగిన లఖింపూర్ ఖేరీ ఘర్షణతో పాటు పలు రైతు సమస్యలపై పోరాటం చేసే విధివిధానాలపై కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి :సింఘు 'హత్య' కేసులో లొంగిపోయిన నిందితుడు!