తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2022, 8:54 PM IST

Updated : Apr 3, 2022, 9:16 PM IST

ETV Bharat / bharat

భారత వాయుసేన చేతికి​ 500కేజీల బాంబు.. శత్రువులకు హడల్​!

Ordnance factory in MP: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 కిలోల బాంబును మధ్యప్రదేశ్‌, జబల్‌పుర్‌లోని ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ తయారు చేసింది. దీనిని భారత వైమానిక దళానికి ఆదివారం అందించినట్లు అధికారులు తెలిపారు.

Ordnance factory
ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ

Ordnance factory in MP: భారత వైమానిక దళం అమ్ములపొదిలోకి 500కిలోల బాంబు చేరింది. ఈ బాంబు చేరికతో వాయుసేన బలం మరింత పెరగనుందని నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్​, జబల్​పుర్​లోని ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీలో.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ బాంబును అభివృద్ధి చేశారు. మొదటి బ్యాచ్​లో భాగంగా మొత్తం 48 బాంబులను వాయుసేనకు అందించినట్లు ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ జనరల్​ మేనేజర్ ఎస్​కే​ సిన్హా తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ బాంబును రూపొందించటంలో వివిధ రక్షణ సంస్థలకు చెందిన నిపుణులు నిమగ్నమయ్యారని ఎస్​కే సిన్హా తెలిపారు.

1943లో స్థాపించిన ఈ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ప్రధాన మందుగుండు ఉత్పత్తి యూనిట్లలో ఒకటి. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ సామగ్రిని అందించింది. స్వాతంత్య్రం తర్వాత.. 1962 చైనా యుద్ధం, 1965, 1971లో జరిగిన పాకిస్థాన్​ యుద్ధాల సమయంలో సాయుధ దళాలకు వివిధ రకాల మందుగుండు సామగ్రిని సరఫరా చేయడంలో ఈ కర్మాగారం కీలక పాత్ర పోషించింది.

ఇదీ చదవండి:ఫోన్లోనే విడాకులు.. భార్యకు ఒక్క రూపాయి పరిహారం​.. పంచాయతీ వింత తీర్పు

Last Updated : Apr 3, 2022, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details