తెలంగాణ

telangana

By

Published : Jul 30, 2023, 12:16 PM IST

Updated : Jul 30, 2023, 12:41 PM IST

ETV Bharat / bharat

మణిపుర్​ గవర్నర్​ను కలిసిన 'ఇండియా' ఎంపీలు.. అక్రమ వలసదారులపై సర్కార్​ ఉక్కుపాదం!

Opposition Manipur Visit : మణిపుర్​ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని.. లేదంటే దేశంలో సాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్​ నేత అధీర్​ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. మణిపుర్​ గవర్నర్​తో విపక్ష కూటమి నేతలు భేటీ అయ్యి.. మెమోరాండం సమర్పించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు అధీర్. మరోవైపు, మయన్మార్‌ నుంచి అక్రమంగా మణిపుర్​లోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

Opposition Manipur Visit
Opposition Manipur Visit

Opposition Manipur Visit : మణిపుర్​ వివాదాన్ని సత్వరమే పరిష్కరించకుంటే.. దేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సీనియర్​ నేత అధీర్​ రంజన్ చౌదరి హెచ్చరించారు. ఆదివారం విపక్ష కూటమి నేతలతో కలిసి మణిపుర్ గవర్నర్​ అనసూయ ఉయికేను కలిసిన తర్వాత.. అధీర్​ రంజన్​ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'గవర్నర్ మా అభిప్రాయాలను విన్నారు. వాటిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. వర్గాల మధ్య అపనమ్మకం తొలగించడానికి.. ప్రజలతో మాట్లాడేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం మణిపుర్‌ను సందర్శించాలని సూచించారు' అని ఆయన తెలిపారు.

Opposition Delegation To Manipur :మణిపుర్​లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయడానికి 21 మంది ఎంపీలతో కూడిన ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రతినిధి బృందం శనివారం మణిపుర్‌కు చేరుకుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు.. బిష్ణుపుర్​, చురాచంద్​పుర్​ జిల్లాల్లోని ఇంఫాల్​, మోయిరాంగ్​లో ఉన్న అనేక శిబిరాలను సందర్శించి.. బాధితులను కలుసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం మణిపుర్​ గవర్నర్ అనసూయ ఉయికేను రాజ్​భవన్​లో కలిసి.. తమ పరిశీలనల మీద మెమోరాండం సమర్పించారు. మణిపుర్‌లో శాంతి పునరుద్ధరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

'శిబిరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది'
Manipur Relief Camps : 'ఒకే హాలులో 400 నుంచి 500 మంది బస చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్నం, పప్పు మాత్రమే అందిస్తోంది. పిల్లలకు రోజంతా తినడానికి వేరే ఏమీ లభించడం లేదు. శౌచాలయాల సౌకర్యం లేదు. శిబిరాల్లో ప్రజలు నివసిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది' అని కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవీ నేతమ్ తెలిపారు.

అక్రమ వలసదారులపై సర్కార్​ ఉక్కుపాదం!
Manipur Illegal Migrants : మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు అధికారులు దిద్దిబాటు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మయన్మార్‌ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం మణిపుర్‌ ప్రజల నుంచి బయోమెట్రిక్‌ డేటాను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. "మయన్మార్‌ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించి.. ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించేందుకు బయోమెట్రిక్‌ డేటా సేకరణ ప్రారంభించాం. ఈ ప్రక్రియ సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డేటా సేకరించేందుకు జాతీయ నేరాల నమోదు సంస్థ నుంచి మణిపుర్‌కు ప్రత్యేక బృందాలు వచ్చాయి" అని మణిపుర్‌ హోంశాఖ జాయింట్ సెక్రటరీ పీటర్‌ సలామ్‌ తెలిపారు.

Last Updated : Jul 30, 2023, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details