కరోనా టీకాపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని భాజపా ఆరోపించింది. ముఖ్యంగా టీకాపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని విమర్శించింది.
"భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ సామర్థ్యాన్ని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్, బంగాల్, ఝార్ఖండ్లు కొవాగ్జిన్ టీకా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. భారత శాస్త్రవేత్తల్ని మీరు(ప్రతిపక్షాలు) నమ్మటం లేదా? 40 దేశాలు కొవాగ్జిన్ టీకా కావాలని అడిగాయి. కానీ ఇండియాలోని ప్రతిపక్షాలు.. టీకాపై స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయి."
-సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి