తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మే 31న కేరళకు నైరుతి రుతుపవనాలు! - కేరళకు నైరుతి రుతుపవనాలు

ఒకరోజు ముందే(మే 31) నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

monsoon
నైరుతి రుతుపవనాలు

By

Published : May 14, 2021, 7:20 PM IST

ఈ ఏడాది ఒక రోజు ముందే(మే 31న) నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. సాధారణంగా ప్రతి ఏడాదీ రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకుతుంటాయి.

దేశంలో రుతుపవనాలు మొట్టమొదట(మే 22న) దక్షిణ అండమాన్​లోని సముద్ర ప్రాంతానికి చేరనున్నాయి. అనంతంరం బంగాల్ తీరం నుంచి వాయవ్య దిశగా ముందుకు కదులుతాయని ఐఎండీ పేర్కొంది.

ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని (ఐఎండీ) తెలిపింది.

ఇవీ చదవండి:కేరళకు 'తౌక్టే' ముప్పు- రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​

రానున్న రెండురోజులు కేరళలో కుండపోతే!

ABOUT THE AUTHOR

...view details