కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి నేటితో ఏడాది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సహా.. వైరస్ను ఎదుర్కొనేందుకు దేశ వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో.. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలపై 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించింది కేంద్రం. ప్రపంచంలో అత్యంత కఠినంగా అమలైన లాక్డౌన్గా ఇది రికార్డుకెక్కింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్డౌన్ను క్రమంగా మూడుసార్లు పొడిగించారు.
ఇదీ చదవండి:భారత్ బంద్: లాక్డౌన్గా మారిన జనతా కర్ఫ్యూ!
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
లాక్డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రికార్డు స్థాయిలో జీడీపీ పడిపోయేందుకు కారణమైంది. సాంకేతికంగా దేశాన్ని మాంద్యంలోకి నెట్టింది. అయితే.. ఎంత వేగంగా పడిపోయిందో.. అంతే వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. పెట్టుబడులు పెరిగాయి. జీడీపీ గాడిలో పడింది. వచ్చే ఏడాది రికార్డు స్థాయి వృద్ధి నమోదవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.
సానుకూలతలు
- కరోనా కట్టడికి బలోపేతంగా మారిన వైద్య వ్యవస్థ
- పరీక్షల సామర్థ్యం, ల్యాబ్లు, పరికరాల పెంపు
- మానవ కార్యకలాపాలు పరిమతం కావడం వల్ల పర్యావరణానికి మేలు
- తగ్గిన కాలుష్యం
- తగ్గిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు
- పెరిగిన సాంకేతికత వినియోగం
- ఓటీటీ, ఈ-కామర్స్ సేవలకు పెరిగిన డిమాండ్
- చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ విద్య
- స్వచ్ఛత, పరిశుభ్రతపై పెరిగిన అవగాహన హిమాచల్ప్రదేశ్లో నిర్మానుష్యంగా ప్రాంతం
ప్రతికూల ప్రభావాలు
- లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
- ఇప్పటికీ కోలుకోని పలు రంగాలు
- గణనీయంగా పెరిగిన నిరుద్యోగం
- స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల తిప్పలు
- పని కోల్పోయి రోజువారీ కూలీల అవస్థలు యువకుడికి మాస్క్ అందిస్తున్న యూపీ పోలీస్