తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా ర్యాలీలో హింస- కార్యకర్త మృతి - పశ్చిమ బెంగాల్ సిలిగుడిలో భాజపా యువ మోర్చా కార్యకర్తల నిరసన ర్యాలీ

బంగాల్​లో దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న భాజపా యువ మోర్చా కార్యకర్తలపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ భాజపా కార్యకర్త మరణించారు. పోలీసులు నాటు బాంబులు విసరడం వల్లే కార్యకర్త ప్రాణాలు కోల్పోయారని యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఆరోపించారు.

One person has died in Siliguri during bjp yuva morcha's uttarkanya march
బంగాల్​ పోలీసుల ప్రతాపం- భాజపా కార్యకర్త మృతి

By

Published : Dec 7, 2020, 5:06 PM IST

మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగాల్​ సిలిగుడిలో భాజపా యువ మోర్చా కార్యకర్తల నిరసనల్లో హింస చెలరేగింది. కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం సహా బాష్ఫవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో భాజపా సీనియర్ కార్యకర్త ఉలెన్ రాయ్ ప్రాణాలు కోల్పోయారు.

బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న పోలీసులు

పోలీసుల తీరుపై భాజపా ఎంపీ, యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య తీవ్రంగా మండిపడ్డారు.

జల ఫిరంగుల ప్రయోగం

"శాంతియుత నిరసనలు చేసిన చాలా మంది భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. బంగాల్​లో ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. మమత పోలీసులు విసిరిన నాటు బాంబుల వల్ల అయిన గాయాలతోనే భాజపా సీనియర్ కార్యకర్త ఉలెన్ రాయ్ మరణించారు."

-తేజస్వీ సూర్య, భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు

రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వంటి సమస్యలకు వ్యతిరేకంగా భాజపా ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. సిలిగుడిలోని రాష్ట్ర సచివాలయ దక్షిణ బంగాల్ యూనిట్ వరకు ర్యాలీగా వెళ్లాలని యత్నించింది.

గాయపడ్డ కార్యకర్త

ABOUT THE AUTHOR

...view details