తెలంగాణ

telangana

నెల రోజుల్లో 7 ఏనుగులు మృతి.. కారణమేంటి?

By

Published : Feb 23, 2021, 5:59 AM IST

ఒడిశాలోని కలహండి జిల్లా కర్లాపాత్​ అభయారణ్యంలో మరో ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. దీంతో నెల రోజుల్లోనే మొత్తం ఏడు ఏనుగులు మరణించాయి. ఇందుకు పశువుల్లో వ్యాపించే హేమోర్హేజ్​ సెప్టీస్కేమియా అనే వ్యాధి కారణంగా కేంద్ర బృందం తేల్చింది. అయితే.. ఏనుగుల మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Elephants dies
ఏనుగులు మృతి

ఒడిశా కలహండి జిల్లా కర్లాపాత్​ అభయారణ్యంలో మరో ఏనుగు మృతి చెందింది. నెల రోజుల వ్యవధిలోనే ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. గజరాజుల మరణానికి పశువుల్లో వ్యాపించే హేమోర్హేజ్​ సెప్టీస్కేమియా అనే వ్యాధిగా అధికారులు తెలిపారు. అయితే.. వీటిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగుల మృతిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పశుసంవర్ధక శాఖ అధికారి గణేశ్​ పుఝారిని సస్పెండ్​ చేసినట్లు జిల్లా ప్రధాన వెటర్నరీ అధికారి చైతన్య శెట్టి తెలిపారు. సదరు అధికారి ఏనుగులకు వ్యాక్సినేషన్​, చికిత్స అందించినట్లు ఎలాంటి రికార్డులు లేవని, జంతువుల ఆరోగ్యంపై నిఘా వేయటంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చెప్పారు.

మరోవైపు.. ఈ అభయారణ్యంలో మరో మూడు జంతువులు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించామన్నారు శెట్టి. వెటర్నరీ సిబ్బందిని రంగంలోకి దింపి పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. అలాగే.. ఏనుగుల మందలను గుర్తించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలను 10కి పెంచుతున్నట్లు డివిజనల్​ ఫారెస్ట్​ అధికారి అశోక్​ కుమార్​ తెలిపారు.

ఏనుగుల మృతి నేపథ్యంలో కర్లాపాత్​ అభయారణ్యాన్ని దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం సందర్శించింది. గజరాజుల మరణానికి హేమోర్హేజ్​ సెప్టీస్కేమియా వ్యాధి కారణంగా తేల్చింది.

ఇదీ చూడండి:పానీపూరీ వివాదం.. భయానక వాతావరణం

ABOUT THE AUTHOR

...view details