తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లక్షా ఎనిమిది వడలతో అంజన్నకు అలంకరణ - లక్షా ఎనిమిది వడా మలైతో ఆంజనేయుడికి అలంకరణ

హనుమాన్ జయంతి సందర్భంగా తమిళనాడులోని ఓ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. స్వామి విగ్రహాన్ని లక్షా ఎనిమిది వడా మలైలతో అలంకరించారు.

anjaneyar temple in tamil nadu
లక్షా ఎనిమిది వడలతో ఆంజనేయుడికి అలంకరణ

By

Published : Jan 12, 2021, 6:32 PM IST

Updated : Jan 12, 2021, 6:47 PM IST

తమిళనాడులోని నమక్కల్​ జిల్లా ఆంజనేయర్​ దేవాలయంలో భక్తులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా లక్షా ఎనిమిది వడా మలై(వడ)లతో ఆంజనేయ విగ్రహాన్ని అలంకరించారు.

లక్షా ఎనిమిది వడా మలైలతో ఆంజనేయుడికి అలంకరణ

ఉదయం 4.45 గంటలకు స్వామి వారికి ప్రత్యేక ఆరాధన, అభిషేకం చేసి వడా మలై కార్యక్రమం చేశారు. ఆంజేయర్​ స్వామి దర్శనార్థం భక్తులు ఇతర రాష్టాల నుంచీ భారీ సంఖ్యలో తరలివచ్చారు.

హనుమాన్​ జయంతి సందర్బంగా ఆంజనేయర్​ ఆలయంలో ఘనంగా పూజలు

ఆంజనేయుడి అనుగ్రహం కోసం లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆలయ కమిటీ నిబంధనలు పెట్టింది. కొవిడ్​ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేసి భక్తులను పరీక్షించింది.

ఇదీ చదవండి:ఎడ్లబండిపై నడ్డా సవారీ.. జల్లికట్టుకు రాహుల్​

Last Updated : Jan 12, 2021, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details