తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2022, 2:31 PM IST

ETV Bharat / bharat

పాత పెట్రోల్ వాహనాలను.. కొత్త ఎలక్ట్రిక్​ బైక్​గా.. ఓ వృద్ధురాలి వినూత్న ఆలోచన

పెట్రోల్​ వాహనాలను ఎలక్ట్రిక్​ బైక్​లుగా మారుస్తారని మీకు తెలుసా? రాజస్థాన్​కు చెందిన ఓ వృద్ధురాలు ఈ వినూత్న ఆలోచనతో ఓ ఆటో మొబైల్ కంపెనీని ప్రారంభించింది. ఆ కంపెనీ గురించి తెలుసుకుందామా..

old petrol  scooter converted in electric vehicle
పాత పెట్రోల్ వాహనాన్ని కొత్త ఎలక్ట్రికల్ వాహనంగా మార్పు

ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పెద్దఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు మండిపోతున్నందున కొనుగోలుదారులు కాస్త వెనక్కి తగ్గుతున్నారు. ఈ సమస్యకు చెక్​ పెట్టేలా.. జైపుర్​కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పాత పెట్రోల్ స్కూటర్, బైక్​లను ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తుంది. జోధ్​పుర్​లో జరుగుతున్న హరే డిజిఫెస్ట్​లో ఈ వాహనాన్ని ఆవిష్కరించింది సంస్థ. చాలా మంది వచ్చి తమ పాత పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చుకుంటున్నారని చెప్పారు వ్యవస్థాపకులు మధు కిరోడీ.

ఎలక్ట్రిక్ బైక్​తో సంస్థ ప్రతినిథులు

"పాత స్కూటర్​ను, కొత్త ఎలక్ట్రికల్ వాహనంగా ఎందుకు మార్చకూడదు అనే ఆలోచన నాలో వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని నా పిల్లలతో చెప్పాను. అయితే వారు బాగా శ్రమించి పాత స్కూటర్​ను ఎలక్ట్రికల్ వాహనంగా మార్చారు. మా ప్రయోగం విజయవంతం కావడం వల్ల మరిన్ని పాత పెట్రోల్ మోటార్ సైకిళ్లను కొత్త ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చాము. ఉద్యోగం వెంట పరిగెత్తే బదులు తమ ఆలోచనతో వ్యాపారం చేస్తే బాగుంటుంది అనిపించింది. తరువాత క్రమంగా ఈ ఆటో మొబైల్ కంపెనీని స్థాపించాం"

-మధు కిరోడీ, కంపెనీ వ్యవస్థాపకురాలు

తమ కంపెనీలో పాత స్కూటర్లు, మోటార్ సైకిళ్లను రూ.30,000 ఖర్చుతోనే మార్చుకోవచ్చని చెబుతున్నారు కిరోడీ. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలిపారు. 120 కిలోమీటర్లకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కేవలం రూ.11 మాత్రమే ఖర్చవుతుంది. అయితే ఈ మోటర్ వాహనాన్ని అదే నంబర్​ ప్లేటుతో కొనసాగించుకోవచ్చని అన్నారు. ఎలక్ట్రికల్ వాహనంగా మార్చిన తర్వాత వాహనాన్ని రవాణా శాఖలో నమోదు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఉన్న నంబర్ ప్లేట్ రంగును మార్చుకోవాల్సిన అవసరం లేదని కిరోడీ వివరించారు.

ఇవీ చదవండి:ఎలక్ట్రిక్ హెల్మెట్.. బైక్ చోరీ అవ్వదు.. పెట్టుకోకుంటే బండి కదలదు!

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల రిలీజ్.. భావోద్వేగంతో కన్నీళ్లు

ABOUT THE AUTHOR

...view details