తెలంగాణ

telangana

By

Published : Dec 8, 2020, 6:20 PM IST

ETV Bharat / bharat

'మమ్మల్నీ కరోనా వారియర్స్​గా గుర్తించండి'

కరోనాపై పోరులో ముందుండి పోరాడిన వారికి తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ​తమనూ.. కొవిడ్ యోధులుగా గుర్తించాలని నాలుగు బ్యాంకు సంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశాయి.

Officer unions demand to include bankers as frontline COVID warriors for vaccination
'మమ్మల్నీ కరోనా వారియర్స్​గా గుర్తించండి'

కరోనా వ్యాక్సిన్​ అతిత్వరలోనే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులను కూడా కొవిడ్​ యోధులుగా గుర్తించాలని డిమాండ్​ చేశాయి బ్యాంకు సంఘాలు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశాయి. టీకా ఇవ్వడంలో కరోనా వారియర్స్​కు మొదటి ప్రాధాన్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సందర్భంగా.. బ్యాంకర్లు కేంద్రం ముందు ఈ ప్రతిపాదనను ఉంచాయి.

జనవరిలో భారత్​ బయోటెక్​, కొవాగ్జిన్​ టీకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటిని మహమ్మారిపై ముందుండి పోరాడిన ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు అందించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో ఆల్​ ఇండియా బ్యాంక్​ ఆఫీసర్స్​ కాన్ఫిడరేషన్​, ఆల్​ ఇండియా బ్యాంకర్స్​ అసోసియేషన్, ఇండియన్​ నేషనల్​ బ్యాంక్​ ఆఫీసర్స్​ కాంగ్రెస్​, నేషనల్​ ఆర్గనైజేషన్​ ఆఫ్​ బ్యాంకర్స్​ సంఘాలు సంయుక్తంగా ఆర్థిక మంత్రికి లేఖ రాశాయి. ​

"దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి బ్యాంకర్లుగా గొప్ప సేవలు అందించాం. లాక్​డౌన్ ప్రకటించినా.. అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలను కొనసాగించాం. ప్రమాదాలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థకు చక్రాలుగా ఉన్నాం. వేలాది మంది బ్యాంకర్లు కరోనా బారిన పడినప్పటికీ నిరంతరాయంగా సేవలను అందించాం. కావున మమ్మల్ని కూడా కరోనా వారియర్స్​గా గుర్తించాలి. వ్యాక్సినేషన్​లో ప్రాధాన్యం ఇవ్వాలి."

- బ్యాంక్​ సంఘాలు

ఇదీ చూడండి: 'శాస్త్రవేత్తల అనుమతి లభించిన వెంటనే వ్యాక్సినేషన్​'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details