తెలంగాణ

telangana

కూర్చుని తింటూనే.. లక్షలు సంపాదిస్తున్నాడు!

By

Published : Jul 11, 2021, 3:03 PM IST

ఒడిశాకు చెందిన ఓ గిరిజన యువకుడు తన యూట్యూబ్​ వీడియోలతో సంచలనం సృష్టిస్తున్నాడు. కూలీ పని చేసుకుని జీవించే అతను.. లాక్​డౌన్​లో ఉపాధి లేక కాలక్షేపం కోసం వీడియోలు చేసి.. ఓ యూట్యూబ్​ ఛానెల్​లో పెట్టాడు. ప్రస్తుతం ఆ యూట్యూబ్​ ఛానెల్​ నుంచి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు.

Isak Munda eating YouTube channel
ఇసాక్ ముండా యూట్యూబ్​ ఛానెల్​

యూట్యూబ్ వీడియోలు చేసి లక్షాధికారైన కూలీ

గతేడాది కరోనా లాక్​డౌన్​ చాలామందికి ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయినా.. కొందరికి మాత్రం మంచే చేసింది! చాలా మంది ఉపాధి కోల్పోయి, బతకడానికి నానా తంటాలు పడితే.. అదే సమయంలో మరికొందరు తమ ప్రతిభకు పదునుపెట్టారు. డబ్బు సంపాదించే దిశగా ప్రయత్నాలు చేశారు. ఆ కోవకు చెందినవాడే ఒడిశాకు చెందిన గిరిజన యువకుడు ఇసాక్​ ముండా. లాక్​డౌన్​లో 'ఇసాక్​ ముండా ఈటింగ్​' అనే పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ ప్రారంభించిన ఈ రోజువారీ కూలీ.. ఇప్పుడు లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు. తన వీడియోలతో అందరి మనసులు దోచుకుంటున్నాడు.

కాలక్షేపం కోసం చూస్తూ..

ఇసాక్​ ముండా.. ఒడిశా సంబల్​పుర్​ జిల్లాలోని మారుమూల బాబుపాళీ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి. ఇసాక్​.. రోజువారీ కూలీపని చేసుకుని జీవితం సాగించేవాడు. అయితే కరోనా లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమయ్యాడు. సొంత ఫోన్ లేకపోయినా.. కాలక్షేపం కోసం తన స్నేహితుల చరవాణుల్లో యూట్యూబ్​ వీడియోలు చూడటం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే తాను కూడా వీడియోలు చేసి యూట్యూబ్​లో పెట్టాలన్న ఆలోచన వచ్చింది.

ఇసాక్​ ముండా
వీడియో రికార్డు చేస్తున్న ఇసాక్​ ముండా

రూ.3వేలు అప్పుచేసి..

వీడియోలు చేసేందుకు కావాల్సిన పరికరాలను కొనేందుకు ఇసాక్​ రూ. 3వేలు అప్పు చేశాడు. అతను​ అప్లోడ్​ చేసిన తొలి వీడియో చాలా సింపుల్​గా ఉంటుంది. ప్లేటు నిండా అన్నం పెట్టుకుని, చాలీచాలని కూరతో తిన్న వీడియోను ఓ కిప్యాడ్ మొబైల్​తో రికార్డు చేసి.. 2020 మార్చి 26న యూట్యూబ్​లో అప్​లోడ్ చేశాడు. అంతే.. అప్​లోడ్​ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది వ్యూస్​, కామెంట్స్​ వచ్చాయి. ఆ తర్వాత తన యూట్యూబ్​ ఛానెల్​కి వ్యూవర్స్​ పెరిగారు.

కుటుంబ సభ్యులతో కలిసి యూట్యూబ్​ చూస్తున్న ఇసాక్​

ఇదే మంచి అవకాశంగా భావించి.. తనకు కీప్యాడ్​ మొబైల్​ మాత్రమే ఉందని, వీడియోలు రికార్డు చేయడానికి స్నేహితుల స్మార్ట్​​ఫోన్​ను తీసుకొస్తున్నట్లు ఇసాక్​ ఓ వీడియోలో చెప్పాడు​. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడం వల్ల.. అతని ఛానెల్​ సబ్​స్క్రైబర్స్​ సంఖ్య కేవలం రెండు రోజుల్లోనే 1.79 లక్షలకు పెరిగింది.

వీడియోల్లో ఏముందంటే...

మొదటి వీడియో ఫార్ములానే నమ్ముకున్నాడు ఇసాక్​. అప్పటి నుంచి రకరకాల కూరలను, అన్నాన్ని ప్లేటులో పెట్టుకుని తినడాన్ని రికార్డు చేసి యూట్యూబ్​లో పెట్టడం మొదలుపెట్టాడు. అలా ఇప్పటికి ఎన్నో వీడియోలు అప్లోడ్​ చేశాడు. చాలా వీడియోలకు రెండు లక్షలకుపైగా వ్యూస్​ ఉండటం విశేషం.

ఇలా కొన్ని నెలల్లోనే యూట్యూబ్​ ద్వారా లక్షల రూపాయలు ఆర్జించాడు ఇసాక్​. దీంతో కూలీపని మానేశాడు. ఇసాక్​ వీడియోలపై వ్యూవర్స్​.. సబ్​స్క్రైబర్స్​ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి సహాయం కూడా చేస్తున్నారు.

ఇదీ చూడండి:'మా చెరువు పోయింది.. కాస్త వెతికి పెట్టండి'

ABOUT THE AUTHOR

...view details