తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా మాజీ సీఎం కన్నుమూత.. ప్రముఖుల సంతాపం - odisha latest news

ప్రముఖ ఆదివాసీ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్​ కన్నుమూశారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో భువనేశ్వర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఒడిశా మాజీ సీఎం
odissa former cm died

By

Published : Feb 26, 2022, 9:59 AM IST

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌ (83) శుక్రవారం రాత్రి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ ఒడిశా జిల్లాల్లో ప్రముఖ ఆదివాసీ నేత అయిన బిశ్వాల్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలందించారు.

రాజకీయ ప్రస్థానమిదే..

ఝార్సుగుడ జిల్లా ఠాకూర్‌పడలో జన్మించిన ఆయన సుందర్‌గఢ్‌ జిల్లా నుంచి రాజకీయాలు నడిపారు. 1974లో తొలిసారిగా లైకిడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా అయిదుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన ఆయన జేబీ పట్నాయక్‌ మంత్రివర్గంలో పలుశాఖల మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2000 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2009 నుంచి 2014 వరకు సుందర్‌గఢ్‌ ఎంపీగా సమర్థ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు.

రాజకీయాలకు దూరంగా..

కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో భువనేశ్వర్‌లో ఉండి చికిత్సలు పొందుతున్నారు. బిశ్వాల్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఒడిశా గవర్నర్‌ ఆచార్య గణేశీలాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి:దివ్యాంగురాలి ఆకాంక్ష.. దిగొచ్చిన క్లాస్​ రూం!

ABOUT THE AUTHOR

...view details