తెలంగాణ

telangana

By

Published : May 1, 2021, 12:29 PM IST

ETV Bharat / bharat

కరోనా కాటుతో ఊపిరి తీసుకున్న దంపతులు

కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది జీవితాలు విషాదాంతం వార్తలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. భయంతో కొందరు.. విరక్తితో మరికొందరు మహమ్మారి సోకగానే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒడిశాలోని దంపతులు కరోనా సోకిందనే భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Odisha: Couple infected with coronavirus commits suicide in nayagarh
ఒడిశా దంపతులు మృతి

కరోనా పాజిటివ్​గా తేలిన దంపతులు బతుకు మీద భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీనితో మహమ్మారితో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు అనాథగా మిగిలాడు. ఈ ఘటన ఒడిశాలోని నాయగఢ్ జిల్లాలో జరిగింది.

కరోనా సోకిందని తెలియగానే ఈ దంపతులు తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా వీరి ఇంట్లో నుంచి ఏ విధమైన చప్పుడు వినిపించడం లేదని ఇరుగు పొరుగువారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details