తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోషల్ మీడియా వేదికగా కరోనాపై కాంగ్రెస్ పోరు! - కాంగ్రెస్ కరోనా న్యూస్

కరోనా పోరులో భాగంగా 'స్పీక్అప్​ టు సేవ్​ లైవ్స్​' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ సహాయ పడాలని పిలుపునిచ్చింది.

Country needs a helping hand in these distressing times: RaGa
కాంగ్రెస్ పార్టీ స్పీక్ అప్ టు సేవ్ లైవ్స్

By

Published : May 11, 2021, 11:56 AM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు '#స్పీక్అప్​టుసేవ్​లైవ్స్​'(ప్రాణాలను కాపాడేందుకు గళం విప్పండి) పేరిట కాంగ్రెస్ పార్టీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ప్రతిఒక్కరు తోచిన విధంగా సాయపడాలని పిలుపునిచ్చారు.

దేశంలో ఆక్సిజన్, ఔషధాలు, పడకల​కు కొరత ఏర్పడిందని, టీకాలూ అందుబాటులో లేవని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ సహా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన సలహాలను సైతం మోదీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని విమర్శించింది. మెడికల్ ఆక్సిజన్ సరఫరా నిరంతరం కొనసాగడం సహా ప్రతి పౌరుడికీ టీకాను ఉచితంగా అందించాలని డిమాండ్ చేసింది.

ఈ నేపథ్యంలో దేశంలోని సాధారణ ప్రజల కోసం ప్రతి ఒక్కరూ తమ గళాన్ని విప్పాలని కోరింది. ప్రస్తుత సమస్యలపై సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి:కేరళ మాజీ మంత్రి కేఆర్​ గౌరీ అమ్మ మృతి

ABOUT THE AUTHOR

...view details