కరోనా రోగుల కోసం 48 గంటల్లో ఓ ఎన్నారై జంట రూ. కోటి విరాళం రూపంలో సేకరించింది. ఆ డబ్బును ఆసుపత్రులకు ఇచ్చారు రాజేశ్ రంగస్వామి- నిత్యా మోహన్.
తమిళనాడు కోయంబత్తూరులోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు రాజేశ్. భార్యతో సహా అమెరికాలోని నెవెడా రాష్ట్రంలో స్థిరపడ్డారు.
కోయంబత్తూరులో కరోనా రోగులు ఆక్సిజన్ లేక, చికిత్సకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారనే విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆర్తూర్ కార్పొరేషన్ ట్రస్టు ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు.