తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆదివారం 'కరోనా' కర్ఫ్యూ​- బోసిపోయిన రోడ్లు

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన వారాంతపు లాక్​డౌన్​తో రోడ్లు వెలవెలబోతున్నాయి. వైరస్ కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న వేళ పలు నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు.

By

Published : Apr 18, 2021, 12:00 PM IST

COVID-induced lockdown, empty roads
కరోనా ఆంక్షలు, లాక్​డౌన్

దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతి.. విలయతాండవం చేస్తోంది. కొత్తగా2,61,500 మందికి వైరస్​​ సోకింది. మరో 1,501 మంది చనిపోయారు. దీంతో వైరస్​ వ్యాప్తి కట్టడికి వివిధ రాష్ట్రాలు లాక్​డౌన్​ సహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

వైరస్​ను కట్టడి చేసేందుకు.. ముంబయిలో కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారు.

ముంబయిలో వాహన తనిఖీలు

వైరస్ కేసుల విజృంభణతో ఉత్తరాఖండ్​లో ఒక రోజు కరోనా కర్ఫ్యూ విధించారు. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి.

కర్ఫ్యూతో దేహ్రాదూన్​లో నిర్మానుష్యంగా రోడ్లు
ఉత్తరాఖండ్​లో మూతపడిన దుకాణాలు

ఉత్తర్​ప్రదేశ్​లో ఆదివారం లాక్​డౌన్​తో వలస కార్మికులు చిక్కుపోయారు. బస్సులు ఎన్నికల విధుల్లో ఉన్నాయని, కనీసం 500 మంది వాటి కోసం ఎదురుచూస్తున్నట్లు కూలీలు చెప్పారు.

యూపీలో చిక్కుకున్న వలస కార్మికులు

యూపీలోని హజ్రత్​గంజ్, విధాన్​సభా మార్గ్​లో రహదారులు వెలవెలబోయాయి.

యూపీలో బోసిపోయిన రోడ్లు
మురాదాబాద్​లో సరకుల కోసం బయటకు వస్తున్న ప్రజలు

చండీగఢ్​లో వారాంతపు లాక్​డౌన్​తో వీధులు, మార్కెట్లు నిర్మానుష్యంగా మారాయి.

చండీగఢ్​లో మూతపడిన షాపులు

సోమవారం ఉదయం వరకు దిల్లీలో వారాంతపు లాక్​డౌన్ విధించారు. దేశ రాజధానిలో వాహనాలను తనీఖీ చేస్తున్నారు పోలీసులు.

దిల్లీలో పోలీసుల తనిఖీలు

వారాంతపు కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం రాత్రి పోలీసులు గస్తీ కాశారు.

దేశ రాజధానిలో రాత్రివేళ పోలీసుల గస్తీ

రాజస్థాన్​లో వైరస్​ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్​డౌన్​ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆంక్షలను ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తున్నారు.

ఉల్లంఘనులకు జరిమానా

ఇదీ చూడండి:టీకాతో ఇన్​ఫెక్షన్ ఆగదు..!

ABOUT THE AUTHOR

...view details