అత్యంత చల్లగా ఉండే రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అక్కడ ఓ జిల్లా మహిళల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో మూడేళ్లుగా ఇప్పటివరకు ఒక్క అత్యాచార ఘటన కూడా వెలుగు చూడలేదు. ఆడవారిపై నేరాలు దాదాపు లేనట్టే. వరకట్న వేధింపుల దాఖలాలే ఉండవు. ఈ ప్రాంత మహిళలు మగవారికి ఏ విషయంలోనూ తీసిపోరు. వ్యవసాయం, పూల తోటల పెంపకం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆ జిల్లానే లాహోల్-స్పీతి.
ఒక్క అత్యాచార కేసు లేదు..
దేశవ్యాప్తంగా రోజుకు ఎన్నో అత్యాచార కేసులు వెలుగు చూస్తున్నాయి. కానీ లాహోల్-స్పీతి జిల్లాలో మూడేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వేరే ప్రాంతాల్లా మహిళలపై హింసాత్మక దాడులు ఇక్కడ ఎక్కువగా ఉండవు. లింగనిష్పత్తి విషయంలో ఇక్కడ 1,000 మంది అబ్బాయిలకు 1,033 మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల అక్షరాస్యత రేటు మిగతా చోట్లతో పోల్చితే మెరుగ్గా ఉంది.
"పొలాల నుంచి తోటల వరకు, ఇంటి పనుల నుంచి ఇతర రంగాల వరకు ఇక్కడి మహిళలు ముందుంటారు. అన్ని విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలను మహిళల అంగీకారంతోనే తీసుకుంటారు. ఇక్కడి పండుగలను మహిళలు ప్రత్యేకంగా జరుపుతారు."
- రామ్లాల్ మార్కాండ, హిమాచల్ ప్రదేశ్ మంత్రి
సంస్కృతిలో భాగమే..