తెలంగాణ

telangana

'దీదీతో కాంగ్రెస్​ పొత్తు జరగని పని'

By

Published : Apr 10, 2021, 6:36 PM IST

బంగాల్​లో హంగ్ ​ఏర్పడితే తృణమూల్​ కాంగ్రెస్​కు హస్తం పార్టీ మద్దతు ఇవ్వదని బంగాల్​ కాంగ్రెస్​ అధ్యక్షులు అధిర్​ రంజన్​ చౌదరి స్పష్టం చేశారు. ఏ పార్టికీ మెజార్టీ రాని పక్షంలో టీఎంసీ, భాజపా చేతులు కలిపే అవకాశం ఉందన్నారు.

Adhir
అధిర్​ రంజన్​ చౌదరి

ఒకవేళ బంగాల్​లో హంగ్​ ఏర్పడితే.. తృణమూల్​ కాంగ్రెస్​తో కలిసే ప్రసక్తే లేదని కాంగ్రెస్​ నేత అధిర్​ రంజన్​ చౌదరి తేల్చిచెప్పారు. అదే సమయంలో.. మెజార్టీ లేకపోతే.. భాజపా, తృణమూల్ కాంగ్రెస్​లు జతకలిసే అవకాశం ఉందని ఆరోపించారు.

ఎన్నికలను సీఎం మమతా బెనర్జీ మతపరంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు.

"మమతా బెనర్జీ వల్లే బంగాల్​లో మతతత్వ రాజకీయాలు ప్రవేశించాయి. ఏ పార్టికి మెజార్టీ లేకపోతే.. ఫలితాల తర్వాత టీఎంసీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అంతేకాకుండా తమ కూటమి సంయుక్త మోర్చా.. తృణమూల్​ మద్దతు కోరే అవకాశాలు కూడా శూన్యం.

-అధిర్​ రంజన్​ చౌదరి, బంగాల్​ కాంగ్రెస్​ అధ్యక్షులు.

'అసహనంలో మమత'

భాజపాకు వ్యతిరేకంగా నిలబడటంలో టీఎంసీ పూర్తిగా విఫలమైందని అన్నారు చౌదరి. ముస్లింలు పెద్ద ఎత్తున తృణమూల్​ కాంగ్రెస్​కు ఓటేయ్యాలని మమతా బెనర్జీ అనడం ఆమెలోని అసహనాన్ని, మతతత్వాన్ని వ్యక్తపరుస్తున్నాయని ఆరోపించారు. ఇదే పని ఆమె గత పదేళ్లుగా చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు.. అబ్బాస్​ సిద్దిఖ్వీ పార్టీ ఇండియన్​ సెక్యులర్​ ఫ్రంట్​(ఐఎస్​ఎఫ్​)తో కాంగ్రెస్​, వామపక్షాలు కూటమిగా ఏర్పడి మతం విషయంలో రాజీపడ్డాయన్న ఆరోపణలను అధిర్​ రంజన్​ చౌదరి ఖండించారు.

బంగాల్​లో 294 శాసనసభ స్థానాలకు ఎనిమిది దశల్లో పోలింగ్​ జరుతోంది. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడుతాయి.

ఇదీ చదవండి:'దీదీ.. హింసతో భాజపా విజయాన్ని అడ్డుకోలేరు'

ABOUT THE AUTHOR

...view details