కరోనా తీసుకునే అభ్యర్థులకు.. దుష్ప్రభావాలు, వైద్య ప్రతికూలతల నుంచి రక్షణ కోసం ఎలాంటి బీమా సౌకర్యం కల్పించడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీకా స్వీకరించడం అభ్యర్థి ఐచ్ఛికమేనని రాజ్యసభకు తెలిపింది.
వ్యాక్సినేషన్ సందర్భంగా తలెత్తే దుష్ప్రభావాలకు బీమా అందిస్తున్నారా అని ఎగువ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే తీవ్ర అలర్జీలకు సంబంధించిన(అనాఫిలాక్సిస్) కిట్లను టీకా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థిని అరగంట పాటు పరిశీలనలో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత తలెత్తే దుష్ప్రభావా(ఏఈఎఫ్ఐ)లకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.