తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు' - ఆక్సిజన్ ప్లాంట్లు

దిల్లీలోని ఆసుపత్రులకు ఆక్సిజన్​ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని దిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రోగులకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్​ను అందుబాటులో ఉంచేందుకు ఏప్రిల్ 22 నుంచి పరిశ్రమలకు ప్రాణవాయువు సరఫరాను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 1,390 వెంటిలేటర్లను అందించామని కోర్టుకు వివరించింది.

oxygen supply
ఆక్సిజన్​ సప్లై

By

Published : Apr 20, 2021, 4:24 PM IST

Updated : Apr 20, 2021, 4:43 PM IST

దిల్లీలోని ఆసుపత్రులకు ఆక్సిజన్​ను సరఫరా చేయటంలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర ప్రభుత్వం.. దిల్లీ హైకోర్టుకు తెలిపింది. పీఎం కేర్స్​ నిధి నుంచి ఎనిమిది ఆక్సిజన్ ప్లాంట్లను దిల్లీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది.

ఏప్రిల్ 22 నుంచి పరిశ్రమలకు ఆక్సిజన్​ను సరఫరా చేయటం నిషేధిస్తామని పేర్కొంది. కొన్ని అత్యవసర పరిశ్రమలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 1,390 వెంటిలేటర్లను అందించామని వివరించింది.

అంతకుముందు.. దిల్లీలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్​-19 రోగులకు సరిపడా ఆక్సిజన్​ను సరఫరాపై కేంద్రాన్ని దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్​ కోసం పరిశ్రమలు వేచిచూడవచ్చని.. కానీ కొవిడ్​ రోగులు కాదని, ప్రజల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలోని కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.

వ్యాక్సిన్​ల వృథాపై అసంతృప్తి

వ్యాక్సిన్​ల వృథాపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రణాళికా లోపంతోనే ఇప్పటివరకు 44 లక్షల డోసులు వృథా అయ్యాయని పేర్కొంది. టీకాల పంపిణీలో వివక్ష తగదని, ఇకనైనా టీకా వృథాను అరికట్టే చర్యలు చేపట్టాలని సూచించింది.

ఇదీ చదవండి :ముంబయిలో 2,200 రెమ్​డెసివిర్​ వయల్స్​ సీజ్​

Last Updated : Apr 20, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details