సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై ఆ బోర్డు స్పష్టతనిచ్చింది. పరీక్షణ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఎటవంటి నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తామని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. పరీక్షణ నిర్వహణపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు.
జూన్ 1 తరువాత పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని వివరించారు.