కరోనా విజృంభణ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.
కరోనా విజృంభణ- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ - covid in inida

దిల్లీలో రాత్రి కర్ఫ్యూ
11:42 April 06
కరోనా విజృంభణ- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు ఆంక్షలు విధించింది.
ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న దృష్టా.. మహారాష్ట్ర కూడా రాత్రి కర్ఫ్యూ అమలు చేసింది. ఇంకా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
లాక్డౌన్ విధించబోం..
ఇదివరకు కరోనా ఉద్ధృతిపై మాట్లాడిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. దిల్లీలో లాక్డౌన్ విధించబోమని తెలిపారు. ప్రజలను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Last Updated : Apr 6, 2021, 12:09 PM IST