తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో రెండో రోజూ ఎన్ఐఏ సోదాలు- ముగ్గురు అరెస్ట్ - కశ్మీర్ ఎన్ఐఏ

జమ్ముకశ్మీర్​లోని అనంతనాగ్ జిల్లాలో రెండో రోజూ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు, ఆదివారం సైతం ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ.. ఆ సోదాలకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

kashmir nia
కశ్మీర్ ఎన్ఐఏ

By

Published : Jul 12, 2021, 9:42 PM IST

జమ్ముకశ్మీర్​లో వరుసగా రెండో రోజూ సోదాలను కొనసాగించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని రెండు ప్రదేశాల్లో సోదాలు చేసింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.

భారత్​లోని యువతలో ఉగ్రవాద భావాలు చొప్పించేందుకు ఐసిస్ ​ఉపయోగిస్తున్న 'వాయిస్ ఆఫ్ హింద్' పత్రికకు సంబంధించిన కేసులో ఈ సోదాలు జరిపింది ఎన్ఐఏ. స్థానికంగా నివసించే ఆకిబ్ అహ్మద్ సోఫీ(అలియాస్ నదీమ్), ముహమ్మద్ ఆరిఫ్ సోఫీ సోదరుల ఇంటిని తనిఖీ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అనంతరం, వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. మరోవైపు, గంజివారాలోని జియోగ్రాఫిక్ ప్రింటింగ్ ప్రెస్​ను రెయిడ్ చేసి ఆరిఫ్ హుస్సెన్ ఖాద్రీ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వివరించాయి. ఓ ల్యాప్​టాప్, పలు కీలక పత్రాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నాయి.

ఎన్ఐఏ ప్రకటన

ఆదివారం సైతం కశ్మీర్​లోని పలు చోట్ల ఎన్ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. యువతను ఉగ్ర భావజాలానికి ఆకర్షితులను చేసి భారత్​కు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారన్న ఆరోపణలతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికారికంగా వెల్లడించింది. ఉమర్ నిసార్, తన్వీర్ అహ్మద్ భట్, రమీజ్ అహ్మద్ లోన్​లను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వీరంతా అనంతనాగ్ జిల్లాకు చెందినవారేనని వెల్లడించింది. డిజిటల్ పరికరాలు, ఐసిస్ లోగో ఉన్న టీషర్టులను సీజ్ చేసినట్లు తెలిపింది.

ఉమర్ నిసార్, తన్వీర్ అహ్మద్ భట్, రమీజ్ అహ్మద్ లోన్

ఇదీ చదవండి:ఐఎస్‌ఐఎస్‌ కుట్ర భగ్నం- ఐదుగురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details