తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2021, 11:10 PM IST

ETV Bharat / bharat

'అట్టడుగు వ్యక్తి న్యాయం కోసం కోర్టు తలుపు తట్టాలి'

అన్యాయం ఎక్కడున్నా.. దానితో న్యాయానికి ముప్పే ఉంటుందని తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నామినేట్​ అయిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. అట్టడుగు వ్యక్తి న్యాయం కోసం కోర్టు తలుపులు తట్టినప్పుడే వ్యవస్థ అందరికీ చేరినట్లు భావించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. గోవాలో బాంబే హైకోర్టు భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. 'నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌' ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని సూచించారు.

next cji nv Ramana_on_Judiciary_reforms at goa
'అట్టడుగు వ్యక్తి న్యాయం కోసం కోర్టు తలుపులు తట్టే రోజు రావాలి'

అన్యాయం ఎక్కడున్నా దాంతో సర్వత్రా న్యాయానికి ముప్పు తప్పదని.. ఒక అంశం ప్రత్యక్షంగా ఒకరిపై ప్రభావం చూపితే పరోక్షంగా అందరిపైనా చూపుతుంది అన్న మార్టిన్‌ లూథర్‌కింగ్‌ వ్యాఖ్యలను అందరూ గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి నామినేట్​ అయిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. గోవాలో నూతనంగా రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించిన బాంబే హైకోర్టు నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొని కీలక ప్రసంగం చేసిన ఆయన.. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు తమకు అవసరమైనప్పుడు న్యాయం కోసం కోర్టుల తలుపులు తట్టే పరిస్థితులు వచ్చినప్పుడే న్యాయవ్యవస్థ అందరికీ చేరువైనట్లుగా భావించాలని అభిప్రాయపడ్డారు.

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరును ప్రతిపాదించిన తర్వాత పాల్గొన్న తొలి కార్యక్రమంలో మాట్లాడిన జస్టిస్​ రమణ భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాల్సిన తీరు, భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరు గురించి కీలక ప్రసంగం చేశారు. దేశంలో న్యాయవ్యవస్థను ఆధునీకరించేందుకు జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:'వారికి ఉచితంగా న్యాయసేవలు అందించండి!'

ఇదీ చదవండి:భార్యలను తీసుకెళ్లని ఎన్​ఆర్​ఐ భర్తలపై వ్యాజ్యం

న్యాయం అందుబాటులోకి రావాలంటే రోజురోజుకీ పెరుగుతున్న కేసులకు తగ్గట్టు మౌలికవసతులు పెరగాల్సిన అవసరం ఉందని.. అన్ని జిల్లాల్లో కోర్టులున్నప్పటికీ ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా వాటిని ఆధునీకరించాల్సి ఉందన్నారు జస్టిస్​ రమణ. న్యాయవ్యవస్థలో దాగివున్న సూక్ష్మ అంశాలను పరిగణలోకి తీసుకొని భారతీయ న్యాయవ్యవస్థ మౌలికవసతుల ఆధునీకరణకు అనువైన, సుస్థిరమైన, సమ్మిళితమైన నమూనాలను మేధావులు, నిపుణులు సూచించాలని కోరారు.

ఇదీ చదవండి:'న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి'

ఇదీ చదవండి:అవసరాలే ఆవిష్కరణలకు ఆలంబన: జస్టిస్ రమణ

మౌలిక వసతుల కల్పన..

దేశంలో న్యాయవ్యవస్థకు ఉన్న మౌలికవసతుల సమస్యలను తీర్చేందుకు ఏకకాల చర్యగా నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని.. ఇలాంటి కార్పొరేషన్‌తో న్యాయవ్యవస్థ మౌలికవసతుల సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులతోపాటు ఏకరూపత, ప్రామాణీకతను తీసుకురావడానికి వీలవుతుందని జస్టిస్‌ రమణ అన్నారు.

పెండింగ్​ కేసుల సమస్య..

పెండింగ్‌ కేసులను తగ్గించి బ్యాక్‌లాగ్‌లన్నింటినీ పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ మౌలికవసతులను బలోపేతం చేయడం అత్యంత ముఖ్యమన్న జస్టిస్​ రమణ.. న్యాయవ్యవస్థ మౌలికవసతులంటే కేసుల పెండింగ్, ఖాళీల భర్తీ, కోర్టు రూముల పెంపు అన్న అంశాలకు అతీతం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. దుర్భల స్థితిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా న్యాయకోసం కోర్టు తలుపులు తట్టినప్పుడే న్యాయవ్యవస్థ ప్రజలకు నిజంగా అందుబాటులోకి వచ్చినట్లుగా నిర్ధరించుకోవాలన్నారు.

న్యాయవాదుల పాత్ర గొప్పది..

భారతీయ న్యాయవ్యవస్థలో న్యాయవాదులకు అవిభాజ్యమైన పాత్ర ఉందని... అందువల్ల సమాజం పట్ల న్యాయవాదులు తమ బాధ్యతలను ఎప్పటికీ మరిచిపోవద్దని జస్టిస్ రమణ అన్నారు. సీనియర్‌ న్యాయవాదులు నెలకు కనీసం రెండు ఉచిత కేసులు చేస్తే అది భారతీయ న్యాయశాఖ రూపురేఖలను సమూలంగా మార్చేస్తుందని.. తద్వారా న్యాయసేవల నాణ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ అందరికీ సులభంగా అందుబాటులోకి రావాలన్న లక్ష్యం వాస్తవ రూపం దాల్చేంతవరకూ న్యాయసేవా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: ఎన్నికల బాండ్ల విక్రయంపై స్టేకు సుప్రీం నిరాకరణ

'సహజీవనం చేస్తే పోక్సో చట్టం కింద శిక్షలా?'

'ఆ రోహింగ్యాలను మయన్మార్​కే పంపిస్తాం'

ABOUT THE AUTHOR

...view details