మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి. శుక్రవారం జరగనున్న భారత్-నేపాల్ జాయింట్ కమిషన్ 6వ సమావేశం(జేసీఎం)లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షతో పాటు కొవిడ్-19 సంబంధిత సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
భారత్లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను కలుపుతూ గతఏడాది నేపాల్ కొత్త మ్యాప్ను విడుదల చేసిన క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ వివాదం చెలరేగిన తరువాత నేపాల్ నుంచి ఓ సీనియర్ నేత భారత పర్యటనకు రావటం ఇదే తొలిసారి.
ఈ క్రమంలో.. శుక్రవారం జరగనున్న 6వ జేసీఎం భేటీలో భారత్-నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. వాణిజ్యం, రవాణా, విద్యుత్తు, సరిహద్దు సమస్యలు, కొవిడ్-19 సహకారం, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్, పెట్టుబడులు, వ్యవసాయం, పర్యటకం వంటి అంశాలపై చర్చించనున్నట్లు నేపాల్ పేర్కొంది.
రెండు వేరు వేరు..