భారత్ పంపిన కొవిడ్-19 టీకాను నేపాల్, బంగ్లాదేశ్లు గురువారం స్వీకరించాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్విట్టర్లో తెలిపారు. పొరుగు దేశాల ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం తమ విదేశీ విధానాల్లో భాగమని పేర్కొన్నారు మంత్రి. బంగ్లాదేశ్కు 20లక్షలు, నేపాల్కు 10లక్షల డోసుల చొప్పున కొవిషీల్డ్ వ్యాక్సిన్ను సరఫరా చేసినట్టు చెప్పారు.
వ్యాక్సిన్ 'మైత్రి'తో బంగ్లాదేశ్-భారత్ల సంబంధానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో స్పష్టమవుతోందని జైశంకర్ అన్నారు. ఎయిర్ఇండియా విమానంలో ఢాకాకు వ్యాక్సిన్లను పంపిన ఫొటోలను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు.