NEET PG Exam EWS Quota: నీట్ పీజీ పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలైన పిటిషన్లపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కేంద్రం సోమవారం కోరింది. మంగళవారం ఈ వ్యాజ్యాలను విచారణ జరపాలని అభ్యర్థించింది. ఈ మేరకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు.
Supreme corut on neet pg reservations: అయితే.. కేంద్రం అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఇవాళ్టి పనులు పూర్తయితే.. తాను ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకువెళతానని జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. మంగళవారం సాధ్యం కాకపోతే.. బుధవారం అయినా దీనిపై విచారణ జరపాలని ధర్మాసనాన్ని మెహతా కోరారు. ప్రభుత్వ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసిన సీనియర్ అడ్వకేట్ అర్వింద్ దాతర్.. మంగళవారం లేదా బుధవారం దీనిపై విచారణ జరిపితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
Resident doctors protest: వాస్తవానికి ఈ వ్యాజ్యాలపై విచారణ జనవరి 6న జరగాల్సి ఉంది. అయితే... నీట్ పీజీ కౌన్సెలింగ్ ఆలస్యానికి వ్యతిరేకంగా.. దిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన నిరసన ఇటీవల ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. తొలుత నవంబర్ 27న నిరసనకు దిగిన రెసిడెంట్ వైద్యులు.. అనంతరం సుప్రీంకోర్టుకు ర్యాలీగా బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే డాక్టర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో వారిపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సమ్మె బాట పట్టారు. ఎట్టకేలకు దిల్లీ పోలీస్ కమిషనర్తో సమావేశం అనంతరం తమ సమ్మెను విరమిస్తూ డిసెంబర్ 31న నిర్ణయం తీసుకున్నారు.
Center on ews qouta in neet pg: మరోవైపు... నీట్ పీజీ పరీక్షల్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగానే ఉంచనున్నట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు ఆదివారం తెలిపింది. త్రిసభ్య కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నట్లు న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: