తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమిత్​ షా-పవార్​ల మధ్య భేటీ జరగనేలేదు' - ఎన్సీపీ అధికార ప్రతినిధి

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య రహస్య భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ గురించి విలేకర్లు అమిత్‌ షాను ప్రశ్నించగా.. ప్రతిదీ బయటకు చెప్పలేం కదా అని ఆయన బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 'మహా' రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​.. గందరగోళం సృష్టించేందుకే భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

NCP's Malik debunks Pawar-Shah meet speculation, attacks BJP
'అమిత్​ షా-పవార్​ల మధ్య భేటీ జరగనేలేదు'

By

Published : Mar 28, 2021, 10:55 PM IST

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడిన వేళ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాలేదు. అయితే, ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్‌ షాను మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించారు. దీనికి ఆయన తనదైన శైలిలో 'ప్రతిదీ బయటకు చెప్పలేం' కదా అని బదులిచ్చారు. భేటీ జరిగిందని గానీ, జరగలేదని గానీ ధ్రువీకరించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.

అనిల్ అనుకోకుండా..

సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవార్‌, ఆ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత అహ్మదాబాద్‌లో శనివారం అమిత్‌షాతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. హోంమంత్రి రాజీనామాకు ఓ వైపు మహారాష్ట్రలోని ప్రతిపక్ష భాజపా పట్టుబడుతున్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో రెండు పార్టీలకు చెందిన నేతలే పాల్గొన్నారా? వేరే ఇంకెవరైనా పాల్గొన్నారా? ఇంతకీ ఏం చర్చించారు? అనే దానిపై సమాచారం లేదు. మరోవైపు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ 'సామ్నా' పత్రికలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారన్నారు.

ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో వాజే కూర్చుని వసూళ్లకు తెరలేపిన విషయం హోంమంత్రికి తెలీకపోవడం ఏంటని ప్రశ్నించారు. రౌత్‌ వ్యాఖ్యలు, పవార్‌ రహస్య భేటీ పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్రలో మరోసారి రాజకీయాలు రక్తికట్టించేలా కనిపిస్తున్నాయి.

అవన్నీ పుకార్లే..

మరోవైపు శరద్ పవార్, అమిత్ షా మధ్య భేటీ వార్తలను ఎన్సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తోసిపుచ్చారు. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి భేటీ జరగలేదని స్పష్టం చేశారు. గందరగోళాన్ని సృష్టించాలన్న భాజపా ప్రయత్నాల్లో భాగంగానే.. ఇలాంటి పుకార్లు వ్యాపిస్తుంటాయని నవాబ్ మాలిక్ అన్నారు.

''గుజరాత్‌లోని ఒక వార్తాపత్రిక శరద్ పవార్, ప్రఫుల్ పటేల్​లు అమిత్ షాను కలిసినట్లు ఒక వార్తను ప్రచురించింది. దీనిపై గత రెండు రోజులుగా ట్విట్టర్‌లో పుకార్లు వ్యాపిస్తున్నాయి. అసలు అలాంటి సమావేశమే జరగలేదు.''

-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి

ఇవీ చదవండి:'భాజపా రాజకీయాలు కేరళలో పనిచేయవు'

'26 కాదు.. 30సీట్లు మీవేనని ప్రకటించుకోండి'

విశ్రాంత జడ్జితో 'మహా' హోంమంత్రిపై విచారణ!

ABOUT THE AUTHOR

...view details