ఛత్తీస్గఢ్, నారాయణపుర్ జిల్లా బహకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు 6వ కంపెనీ కమాండర్ సాకేత్ మృతి చెందాడు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగినట్లు నారాయణపుర్ ఎస్పీ గిరిజా శంకర్ జైశ్వాల్ తెలిపారు.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పోలీసుల బృందం అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డట్టు వివరించారు గిరిజా శంకర్. ఈ కాల్పుల్లో కమాండర్ సాకేత్ మృతిచెందగా.. అతడి దగ్గరి నుంచి ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నామన్నారు.
వరుస దెబ్బలు