తెలంగాణ

telangana

Black Fungus: చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు.. కానీ!

కొవిడ్-19(Covid virus) మహమ్మారి నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి బ్లాక్​ ఫంగస్(Black Fungus)​ సోకింది. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు అతనికి రూ.కోటిన్నర ఖర్చు అయింది. అయినప్పటికీ.. తన ఎడమ కన్ను కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో జరిగింది.

By

Published : Jun 11, 2021, 7:41 PM IST

Published : Jun 11, 2021, 7:41 PM IST

nagpur man black fungus, నాగ్​పూర్​ వ్యక్తి బ్లాక్​ఫంగస్​ చికిత్స
బ్లాక్​ఫంగస్​ చికిత్స కోసం కోట్లల్లో ఖర్చు..

కరోనా వైరస్(Covid virus)​ నుంచి కోలుకున్న వారిపై బ్లాక్​ఫంగస్(Black Fungus)​ పంజా విసురుతోంది. ఈ వ్యాధి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటి ఘటనో మహారాష్ట్రలో జరిగింది. నాగ్​పుర్​లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్​ పాల్​కు గత ఏడాది సెప్టెంబర్​లో బ్లాక్​ఫంగస్ సోకింది. ఈ వ్యాధి​ నుంచి కోలుకోవడానికి రూ.1.48 కోట్లు ఖర్చు అయ్యాయి.

ఇదీ జరిగింది..

మహమ్మారి నుంచి కోలుకున్న కొద్ది రోజులకు పాల్​కు కళ్ల సమస్య మొదలైంది. చికిత్స కోసం నాగ్​పుర్​, హైదరాబాద్​లోని వైద్యులను సంప్రదించాడు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పాల్​కు వచ్చిన సమస్యను వైద్యులు గుర్తించలేకపోయారు. దీంతో నవంబరులో పాల్​ ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరాడు. బ్లాక్​ఫంగస్​ సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు.

ఖర్చులు భరించలేక..

ముంబయిలోని హిందూజా ఆస్పత్రి వైద్యులు అతనికి మూడు శస్త్రచికిత్సలు చేశారు. మందులు, ఇన్​జెక్షన్ల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవడం వల్ల నవీన్​ పాల్​.. నాగ్​పుర్​లోనే చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబరులో నాగ్​పుర్​ చేరుకున్న పాల్​.. అతని​ భార్య రైల్వే ఉద్యోగి కావడం వల్ల స్థానిక రైల్వే ఆస్పత్రిలో చేరాడు.

అక్కడి వైద్యలు పాల్​ ఎడమ కన్ను సహా ఇన్ఫెక్షన్​కు గురైన నోటిలో కొంత భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం కళ్ల సమస్య కొంత తగ్గినట్లు పాల్​ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి :Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?

ABOUT THE AUTHOR

...view details