Nagaland firing news: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగాలాండ్ కాల్పుల ఘటనపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మృతిలో ప్రమేయం ఉందంటూ సైన్యంలోని 21వ పారా ప్రత్యేక దళ సభ్యులపై సుమోటో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
"4వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో భద్రత దళాలతో పాటు పోలీసు గైడ్లు లేరు. అసలు భద్రతా దళాలు ఎవరికీ సమాచారం కూడా అందించలేదు. పౌరులను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే భద్రతా బలగాలు ఈ ఘటనకు పాల్పడినట్టు దీని ద్వారా అర్థమవుతోంది. నేరస్థులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాలి."
--- ఎఫ్ఐఆర్
ఓటింగ్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం సైన్యం ఆపరేషన్ చేపట్టింది. 21 కమాండోలు రంగంలోకి దిగి.. ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆదేశాలిచ్చినా.. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడం వల్ల కమాండోలకు అనుమానం మరింత పెరిగింది. చివరికి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సమాచారం అందుకున్న స్థానికులు.. సైనిక శిబిరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ జవాను మరణించాడు. పలువురు గాయపడ్డారు. ప్రజలను చెదరగొట్టేందుకు.. భద్రతా దళాలు కాల్పులు జరపక తప్పలేదు. ఫలితంగా మరో ఏడుగురు పౌరులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
మృతుల సంఖ్య ఎంత?
Nagaland firing incident death toll: ఘటన జరిగిన మోన్ పట్టణంలో సెక్షన్ 144న కొనసాగుతోంది. అయితే మృతుల సంఖ్య సందిగ్ధx నెలకొంది. కాల్పుల ఘటనలో 17మంది మరణించారని గిరిజనుల సంఘం కోన్యాంక్ యూనియన్ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత దానిని 14కు సవరించింది. శని, ఆదివారాల్లో జరిగిన వేరువేరు ఘటనల్లో 14మంది పౌరులు మరణించారని పోలీసులు చెబుతున్నారు.