తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2021, 7:30 PM IST

ETV Bharat / bharat

రూ.100కే కరోనా టెస్టింగ్​ కిట్- 10 నిమిషాల్లోనే రిజల్ట్​!

కరోనా టెస్ట్​కు కొత్త కిట్​ను అభివృద్ధి చేసింది కర్ణాటకలోని మైసూర్​ విశ్వవిద్యాలయం. హైదరాబాద్​కు చెందిన ఓ ప్రవేటు సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన ఈ కిట్​.. 90శాతం కచ్చితత్వంతో పని చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కిట్​ కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఫలితాన్నిస్తుందని పేర్కొన్నారు.

Mysore University
మైసూర్​ విశ్వవిద్యాలయం

మైసూర్​ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం సరికొత్త కొవిడ్​ టెస్టింగ్​ కిట్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్​కు చెందిన లోర్వెన్​ బయోలాజిక్స్​ ప్రైవేటు సంస్థతో కలిసి ఈ కిట్​ను రూపొందించింది. ఇది 90 శాతం కచ్చితత్వంతో పని చేస్తుందని.. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఫలితాన్నిస్తుందని పరిశోధకులు మైసూర్​ మాజీ ఉపకులపతి, ఎయిమ్స్​ సభ్యుడు కేఎస్​ రంగప్ప తెలిపారు. ఈ కిట్​ సాయంతో ఇంటి దగ్గరే లాలాజలం, నాసిక, కఫం ద్వారా కరోనా పరీక్ష చేసుకోవచ్చని పేర్కొన్నారు.

"బార్‌కోడ్ స్ట్రిప్​ను యాప్​తో అనుసంధానించడం ఈ కిట్​లోని మరో ప్రత్యేకత. బార్‌కోడ్​ స్కాన్​ చేసిన వెంటనే రోగి ఆరోగ్య పరిస్థితి (పాజిటివ్​ లేదా నెగటివ్) సర్వర్‌లో పొందుపరుస్తుంది. తద్వారా వైద్యులు తక్షణమే బాధితులకు చికిత్స అందించడానికి వీలుంటుంది. ఈ కిట్ తయారీలో మాలిక్యూలర్ బయాలజీ, నానోటెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లోని ఆధునిక సాంకేతికతను ఉపయోగించాం" అని పరిశోధనా బృందం తెలిపింది.

ఈ కిట్​ను అత్యవసర వినియోగ అనుమతి కోసం ఐసీఎంఆర్​కు పంపినట్లు తెలిపిన రంగప్ప.. అనుమతి లభిస్తే తయారీదారులతో చర్చలు జరిపి, దీని ధర రూ.100 కంటే తక్కువకే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.

మైసూర్​ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్​ ఎస్​ చంద్ర నాయక్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్​ సీడీ మోహన్​, మాలిక్యూలర్​ బయాలజీ విద్యార్థులు.. టెస్టింగ్​ కిట్​ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఈ బృందానికి రంగప్ప నేతృత్వం వహించారు.

ఇదీ చూడండి:56 ఏనుగులకు కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details