తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పునాది' లేకుండానే ఇంటి నిర్మాణం.. ఖర్చు 40 శాతం తక్కువే! - House Building

House without foundation: ఇంటిని నిర్మించాలంటే ముందుగా పునాది సిద్ధం చేయాలి. కానీ, కర్ణాటకలోని మైసూర్​కు చెందిన ఓ ఆర్కిటెక్ట్​ అసలు పునాదే లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అందుకోసం మూడు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇప్పటికే రెండు ఇళ్లను నిర్మించి.. అందరి మన్ననలు పొందుతున్నారు. ఆ కొత్త టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం.

home without foundation via new technology
'పునాది' లేకుండానే ఇల్లు నిర్మాణం

By

Published : Jan 13, 2022, 7:11 PM IST

House without foundation: ఏ పని చేసినా బలమైన పునాది కావాలంటారు పెద్దలు. అదే విధంగా దృఢమైన పునాది ఉంటేనే ఇల్లు తరతరాలు నిలుస్తుంది. కానీ, కర్ణాటకలోని మైసూర్​కు చెందిన ఆర్కిటెక్ట్​ శరత్​ కుమార్​ సరికొత్త, ప్రత్యేకమైన సాంకేతికతను తీసుకొచ్చారు. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా తక్కువ ధరలో, తక్కువ సమయంలో పునాది లేకుండానే ఇంటి నిర్మాణం చేపట్టొచ్చని చెబుతున్నారు​. ఈ సాంకేతికతను అడ్వాన్స్​డ్​ రాపిడ్​ కన్​స్ట్రక్షన్​గా పేర్కొన్నారు.

పునాది లేకుండానే నిర్మించిన ఇల్లు

శరత్​ కుమార్​ రెండు సంవత్సరాల పాటు ఓ విదేశీ సంస్థలో ఆర్కిటెక్ట్​గా పని చేశారు. ఈ క్రమంలోనే పునాది లేకుండా ఇంటిని నిర్మించే టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. కొత్త సాంకేతికతతో తొలుత హెచ్​డీ కోటే ప్రాంతానికి సమీపంలో ఓ డైరీ భవనాన్ని నిర్మించారు శరత్​. విజయవంతంగా దానిని పూర్తి చేశాక మైసూర్​లోని బండిపాళ్యలో ఓ ఇంటి నిర్మాణం చేపట్టారు. కర్ణాటకలో పునాది లేకుండానే నిర్మించిన తొలి ఇల్లుగా ఇది గుర్తింపు పొందింది.

పునాది లేకుండానే నిర్మించిన ఇల్లు

"సాధారణంగా ఇంటి నిర్మాణం కోసం 5-6 అడుగుల లోతు పునాది తీస్తాం. కానీ, మేము పునాది లేకుండా ఇంటిని నిర్మించేందుకు మూడు పద్ధతులను ఉపయోగించాం. మొదటిది పైల్​ ఫౌండేషన్​, ఇందులో ట్రాక్టర్​ ద్వారా 7 అడుగుల లోతు వరకు రంధ్రం చేసి పిల్లర్​ను ఏర్పాటు చేస్తాం. రెండోది ప్లింత్​ బీమ్​, మూడోది స్లాబ్​ ఆన్​ గ్రేడ్​ పద్ధతి."

- శరత్​ కుమార్​, ఆర్కిటెక్ట్​

సాధారణంగా ఇంటిని నిర్మించేందుకు కనీసం 6-7 నెలల సమయం పడుతుందని, కానీ ఈ కొత్త సాంకేతికత ద్వారా కేవలం 3 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయొచ్చని చెప్పారు. ఇందుకోసం కూలీల అవసరం కూడా ఎక్కువగా ఉండదన్నారు. 30-40 శాతం నిర్మాణ వ్యయం తగ్గిపోతుందని చెబుతున్నారు. నిర్మాణానికి కాంక్రీట్​ ఉపయోగించటం ద్వారా ఇల్లు 75-100 ఏళ్ల పాటు మన్నికగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

భూమిని చదును చేస్తున్న జేసీబీ
పైల్​ ఫౌండేషన్ పద్ధతిలో చేపడుతున్న నిర్మాణం
కొత్త టెక్నాలజీతో ఇంటి నిర్మాణం

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details