సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆయన తన స్వగ్రామం సైఫాయిలో ఓటు వేసేందుకు వెళ్లలేదు. 81 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయడం తప్పలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ములాయం సింగ్ను ఈసారి ఓటు వేసేందుకు రావొద్దని తామే కోరామని, అదృష్టవశాత్తు ఆయన అంగీకరించారని ములాయం బంధువు ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. యూపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సోమవారం జరిగింది.
దేశంలో కరోనా వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రోజూ 2లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వైద్య సదుపాయాల కొరతకు తోడు నానాటికీ మరణాల సంఖ్యా పెరుగుతుండటం తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వైరస్ ప్రళయం కొనసాగుతుండటంతో.. మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో అసాధారణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
దిల్లీలో మెట్రో రైళ్లు తిరుగుతాయ్..
దిల్లీలో సోమవారం రాత్రి 10గంటల నుంచి ఏప్రిల్ 26 ఉదయం 5గంటల వరకు పూర్తి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోనే ఉంటాయని దిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ వెల్లడించింది. రద్దీ అధికంగా ఉన్న సమయాలైన ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు; అలాగే, సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు రైళ్లు నడుస్తాయని స్పష్టంచేసింది. మిగతా సమయాల్లో మాత్రం ప్రతి 60 నిమిషాలకు రైళ్లు నడపనున్నట్టు తెలిపింది. 50శాతం సిటింగ్సామర్థ్యంతోనే రైళ్లు నడుపుతున్నట్టు స్పష్టంచేసింది.
వీసా సర్వీసులు నిలిపివేస్తున్నాం