తనపై అత్యాచారం చేయాలనుకున్న ఓ దుర్మార్గుడికి తగిన రీతిలో బుద్ధి చెప్పింది మధ్యప్రదేశ్కు చెందిన మహిళ. అఘాయిత్యానికి పాల్పడేందుకు ఇంట్లోకి చొరబడిన వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. సిధి జిల్లాలోని ఉమారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గురువారం రాత్రి 11 గంటలకు ఈ ఉదంతం జరిగిందని ఖాదీ ప్రాంత ఎస్సై ధర్మేంద్ర సింగ్ రాజ్పుత్ తెలిపారు. ఆ సమయంలో తన భర్త పని మీద వేరే ప్రాంతానికి వెళ్లినట్లు మహిళ(45) చెప్పిందని వెల్లడించారు. 13 ఏళ్ల కొడుకు కూడా మహిళతో పాటు ఉన్నాడని చెప్పారు. నిందితుడు(45) ఇంట్లోకి చొరబడగానే.. దొంగలు వచ్చారని భయపడి బయటకు పరుగులు తీశారని వివరించారు.
"మహిళను కొట్టి లైంగికంగా దాడి చేసేందుకు నిందితుడు యత్నించాడు. 20 నిమిషాలకు పైగా నిందితుడిని మహిళ నిలువరించింది. తనను తాను కాపాడుకునేందుకు మంచం కింద ఉన్న కొడవలి తీసి.. నిందితుడి మర్మాంగాన్ని కోసేసింది. తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి రాత్రి 1.30 గంటలకు ఫిర్యాదు చేసింది."