తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెట్రోల్ చౌకగా కావాలంటే.. అఫ్గానిస్థాన్​ వెళ్లండి'

పెట్రోల్ చౌకగా కావాలంటే తాలిబన్ల వద్దకు వెళ్లాలని ఓ భాజపా నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న సమయంలో ధరల పెంపు గురించి ఎలా అడుగుతున్నారంటూ ఆయన మండిపడ్డారు.

By

Published : Aug 20, 2021, 5:51 AM IST

Updated : Aug 20, 2021, 6:17 AM IST

Afghanistan
తాలిబన్

పెట్రోల్​ చౌకగా కావాలంటే అఫ్గానిస్థాన్​ వెళ్లాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్​కు చెందిన భాజపా నేత. ధరల పెరుగుదలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కటనీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్​రతన్ పాయల్ ఈ మేరకు బదులిచ్చారు.

"ధరలు పెరుగుతున్నాయా? అయితే తాలిబన్ల చోటుకు వెళ్లండి. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుంది. కానీ దానిని కొనేవారున్నారా? కనీసం మన దగ్గర శాంతియుత పరిస్థితులున్నాయి. మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోంది" అని రామ్​రతన్ అన్నారు.

దుమారం రేపుతున్న భాజపా నేత వ్యాఖ్యలు

ఇక కరోనా మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ధరల పెరుగుదల గురించి అడగడమేంటని రామ్​రతన్ అసహనం వ్యక్తంచేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? అని అడిగారు. కాగా, ఆయనే మాస్కు పెట్టుకోకుండా తిరగుతున్నారని పలువురు ఆరోపణలు చేశారు.

ఇదీ చూడండి:పెట్రోల్​ ధరలను గత ప్రభుత్వంలా మేం తగ్గించలేం: నిర్మల

Last Updated : Aug 20, 2021, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details