తెలంగాణ

telangana

ప్రభుత్వ ఆస్పత్రిలో 50 మంది నర్సులపై లైంగిక వేధింపులు!

By

Published : Jun 15, 2022, 8:59 PM IST

Sexual harassment: ప్రభుత్వ ఆస్పత్రిలో 50 మంది నర్సులపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం దుమారం రేపింది. ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని సర్కారు ఆదేశించింది.

sexual harassment
ప్రభుత్వ ఆస్పత్రిలో 50 మంది నర్సులపై లైంగిక వేధింపులు!

Hamidia hospital: మధప్రదేశ్ భోపాల్​లోని హమీదియా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న 50 మంది నర్సులు తమపై సూపరింటెండెంట్​ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్​లోనే అతిపెద్ద వైద్య కేంద్రంలో ఇలా జరగడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్ మానవహక్కుల కమిషన్ కూడా ఆరోగ్య శాఖ కమిషనర్​కు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై 10 రోజుల్లోగా స్పందన తెలపాలని కోరింది.
ఆస్పత్రి సూపరింటెండెంట్​పై ఫిర్యాదు వచ్చినమాట వాస్తవమేనని మధ్యప్రదేశ్ ఆరోగ్యమంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. ఈ విషయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. డివిజనల్ కమిషనర్​ గుల్షాన్​ బమ్రా దీనిపై దార్యాప్తు చేస్తారని వివరించారు.

ఆస్పత్రిలో, ప్రత్యేకించి రాత్రి వేళ విధులు నిర్వహించే సమయంలో నర్సులపై సూపరింటెండెంట్ డా.దీపక్​ మరావీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సిబ్బంది వర్గాలు తెలిపాయి. వికృత చేష్టలతో ఇబ్బంది పెడుతున్నాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్​నాథ్ స్పందించారు. ప్రఖ్యాతిగాంచిన ఆస్పత్రిలో ఇలా జరగడం దారుణమన్నారు. నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, మైనర్లపై నేరాల్లో మధ్యప్రదేశ్ దేశంలోనే టాప్​లో ఉందన్నారు. చిన్నారులకు కూడా భద్రత లేదన్నారు. ఇది సుపరిపాలనా? అని భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:రాష్ట్రపతి ఎన్నికపై విపక్ష నేతలతో రాజ్​నాథ్​ చర్చ.. ఏకగ్రీవానికి పావులు?

ABOUT THE AUTHOR

...view details